లోకేష్, చంద్రబాబును తిట్టనందుకే టిక్కెట్ ఇవ్వట్లేదని జగన్ చెప్పారు : మైలవరం ఎమ్మెల్యే

లోకేష్ , చంద్రబాబుని తిట్టవు నిన్నెలా నమ్మాలని జగన్ అడిగారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జగన్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. తిట్టనివాళ్లకి ఎమ్మెల్యే , పార్లమెంటు సీట్లు ఇవ్వనని చెప్పారని … మనసు గాయపడినప్పుడు నిలువెత్తు బంగారం ఇస్తామన్నా ఉండలేమని వైసీపీకి రాజీనామా చేస్తున్న అంశంపై పరోక్షంగా స్పందించారు. మైలవరం నియోజకవర్గంలోని పలువురు నాయకులు, ముఖ్యనేతలతో వసంత సోమవారం ఆత్మీయ సమావేశం నిర్విహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకి స్వస్తిపలికి వ్యాపారాలు చేసుకుందాం అనుకున్నానన్నారు. అయితే శ్రేయోభిలాషులు రాజకీయాల్లోనే ఉండమన్నారని చెప్పుకొచ్చారు.

2014లో ఓడిపోయిన, 2019లో నన్ను గెలిపించని జోగిరమేష్‌ను నేను గెలిపించాలట అని పార్టీ హైకమాండ్ సూచనలపై మండిపడ్డారు. పనులు చేసిన వారికి బిల్లులు ఇవ్వమంటే ఇవ్వడంలేదన్నారు. ఎన్ని సార్లు చెప్పిన అరణ్య రోదనే అయిందన్నారు. కృష్ణా, గుంటూరులో 33 నియోజకవర్గాల్లో దాదాపు అన్ని వైసీపీ గెలిస్తే.. రాజధాని మార్పుపై ఇక్కడ ప్రజలకు సమాధానం ఎలా చెప్పాలిని రాజధాని నిర్ణయం తీవ్ర నష్టం తెస్తుందని అప్పుడే చెప్పానని వసంత కృష్ణ ప్రసాద్ సమావేశంలో చెప్పారు. రాజధాని మార్పు సరి కాదని తాను, మల్లాది విష్ణు చెప్పామన్నారు. కొడాలి నాని సీఎం నిర్ణయం ఫైనల్.. ఆయన నిర్ణయానికి ఎదురు చెప్పకూడదని వారించారని కృష్ణ ప్రసాద్ తెలిపారు.

అంబటి లేచి ఆయన నివాసంలో ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉండకూడదని హెచ్చరించారన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆయన కొడాలి నాని తరహాలో ఎన్టీఆర్ తో పాటు వైఎస్ఆర్ బొమ్మతో ప్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close