విహెచ్ కూడా దానిని వాడేసుకొన్నారే?

కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు తీరే వేరని అందరికీ తెలిసిన విషయమే. ప్రజల దృష్టిని ఆకర్షించడం ఎలాగో ఆయనకి తెలిసినంత బాగా బహుశః ఆ పార్టీలో మరెవరికీ తెలియదేమో? ట్యాంక్ బండ్ మీద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన నిన్న హటాత్తుగా మౌన దీక్షకు కూర్చొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధి రోహిత్ మృతికి కారకులయిన వారినందరిపై తక్షణమే చర్యలు చెప్పట్టాలని, రోహిత్ కి, అలాగే సస్పెండ్ అయిన విద్యార్ధులు అందరికీ కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన నిన్న ఒక్కరోజు మౌన దీక్ష చేపట్టారు.

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సిలర్ అప్పారావుపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు కానీ ఆయన దీర్ఘకాల శలవుపై వెళ్ళిపోయారు. అలాగే రోహిత్ మరణం తరువాత మిగిలిన నలుగురు విద్యార్ధులపై సస్పెన్షన్ ఎత్తివేశారు. కానీ వాటర్ధం రోహిత్ కి, అతని కుటుంబానికి, సస్పెండ్ చేయబడిన నలుగురు విద్యార్ధులకు న్యాయం జరిగిందని కాదు. ప్రభుత్వం ఇంకా బాధ్యులపై చర్యలు తీసుకోవలసి ఉంది. అలాగే మళ్ళీ ఇటువంటి పరిస్థితులు, సంఘటనలు పునరావృతం కాకుండా యూనివర్సిటీ యాజమాన్యం తగిన చర్యలు చేపట్టవలసి ఉంది. అవి ఎప్పటికయినా జరుగుతాయో లేదో ఎవరికీ తెలియదు. కనుక ఈ సంఘటనను వి.హనుమంత రావు వంటి రాజకీయ నేతలు ఉపయోగించుకొంటూనే ఉంటారు.

ఫిబ్రవరి రెండున జి.హెచ్.ఎం.సి.ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక ప్రజల దృష్టిని ఆకర్షించడానికి వి.హనుమంత రావు చేసిన మౌన దీక్ష ఉపయోగపడుతుందేమో గానీ అసలు సమస్య పరిష్కారానికి ఏమాత్రం ఉపయోగపడదని చెప్పవచ్చును. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ఆ సంఘటనను పక్కన పెట్టి ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయిపోవడం గమనించవచ్చును. కనుక రాజకీయ నాయకులందరూ బహుశః జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు పూర్తి కాగానే ఇక ఈ సమస్యని పక్కనపడేసి మరో తాజా సమస్యకి షిఫ్ట్ అయిపోయినా ఆశ్చర్యమేమీ లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close