ఓ ఆకాశహర్మ్యం. దానిపై కోట కట్టుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే అద్భుతంగా ఉంటుంది కదా. కాని బిలియనీర్లు అయినా కల కంటారు కానీ కట్టుకోలేరు…కానీ విజయ్ మాల్యా మాత్రం ప్రత్యేకం. కల కంటే దాన్ని నిజం చేసుకుంటారు. బెంగళూరులోని ఆయన ఇల్లే దీనికి నిదర్శనం.
విజయ్ మాల్యా “స్కై మాన్షన్” బెంగళూరులోని యూబీ సిటీలో ఉంటుంది. కింగ్ఫిషర్ టవర్స్ పైన 34వ మరియు 35వ అంతస్తులలో ఉంది. వైట్ హౌస్ నమూనాలో ఉంటే ఈ ఇల్లు.. ఆకాశంలో కట్టిన కోటలా ఉంటుంది. ఇన్ఫినిటీ పూల్, రూఫ్టాప్ హెలిప్యాడ్, వైన్ సెల్లార్, ఇండోర్ హీటెడ్ పూల్, జిమ్, సలోన్, స్పా, 360-డిగ్రీ వ్యూ డెక్ ఉన్నాయి. రెండు ప్రైవేట్ ఎలివేటర్లతో పూర్తిగా ప్రైవేట్ విల్లా లా ఉటుంది. ఈ మాన్షన్ రూ. 200 కోట్ల వరకూ ఉంటుంది.
విజయ్ మాల్యా 2016లో భారతదేశం నుండి యూకేకి పారిపోయారు. 2016లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాల్యా ఆస్తులను జప్తు చేసింది, ఇందులో కింగ్ఫిషర్ టవర్స్లోని ఫ్లాట్లు కూడా ఉన్నాయి. ఈ ఇల్లు కూడా అందులో ఉంది. ఈ ఇంటిని నిర్మించి అందులో ఉండాలనుకున్నారు కానీ ఆయన పారిపోవడంతో సాధ్యం కాలేదు. ఇప్పుడు ఈడీ జప్తులో ఉండటంతో అమ్మకం సాధ్యం కాదు. అలాగే ఎవరూ ఉపయోగించడం లేదు. వివాదాల పరిష్కారం తర్వాత వేలం వేసే అవకాశం ఉంది.
సాంకేతితంగా విజయ్ మాల్యా స్కై మాన్షన్ ఇంకా అతని పేరుపైనే ఉంది. అతని లగ్జరీకి బ్రాండ్ గా కనిపిస్తూనే ఉంది.