చంద్ర‌బాబు మీద ఫిర్యాదు చేసిన విజ‌యసాయి రెడ్డి!

ఎన్నిక‌ల సంఘానికి అత్య‌ధిక ఫిర్యాదులు అందించిన నాయ‌కుడిగా ఒక రికార్డు స్థాపించాల‌న్న కృతనిశ్చ‌యంతో ఉన్న‌ట్టున్నారు వైకాపా రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి! ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చింది మొద‌లు, ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడుపై రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి గోపాల‌కృష్ణ ద్వివేదీకి విజ‌యసాయి తాజాగా ఒక ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉంద‌నీ, దాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఉల్లంఘించార‌నీ, వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఆ ఫిర్యాదులో కోరారు.

ప్ర‌భుత్వ స‌దుపాయాల‌తో ఎమ్మెల్యేల‌తో క‌లిసి ప్ర‌జావేదిక‌లో స‌మావేశాలు సీఎం నిర్వ‌హిస్తున్నార‌ని విజ‌యసాయి ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ అవ‌స‌రాల కోసం ప్ర‌జా వేదిక‌ను సీఎంతోపాటు మంత్రులు కూడా వాడుకుంటున్నార‌న్నారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న‌ప్పుడు, ఒక పార్టీకి చెందిన‌వారే ప్ర‌భుత్వ ఆస్తులైన వీడియో కాన్ఫ‌ర‌రెన్స్ హాళ్లు, స‌దుపాయాల‌ను వాడుకోవ‌డం స‌రికాద‌ని ఆయ‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, ప్ర‌భుత్వ గెస్ట్ హౌస్ లు, మీటింగ్ హాళ్లు, వీడియో కాన్ఫ‌రెన్స్ సౌక‌ర్యం… ఇలాంటివ‌న్నీ అన్ని పార్టీల‌కూ స‌మానంగా వాడుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని విజ‌యసాయి కోర‌డం విశేషం! ప్ర‌స్తుతం చంద్ర‌బాబు నాయుడు నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌న్నీ ఎన్నిక‌ల సంఘం నుంచి ముంద‌స్తు అనుమ‌తులు తీసుకుని చేస్తున్న‌వా కాదా అనేది కూడా త‌మ‌కు తెలియ‌జేయాల‌ని విజ‌యసాయి రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిని కోర‌డం జ‌రిగింది! ఇక‌, వారు స్పందించ‌డ‌మే త‌రువాయి అనుకోవ‌చ్చు.

ఇప్పుడూ… ఏపీలో ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి, ముఖ్య‌మంత్రి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి, ఆ లేఖ‌ను గ‌వ‌ర్న‌ర్ కి అందించి, ఎన్నిక‌ల‌కు వెళ్ల‌లేదు క‌దా? అలాంట‌ప్పుడు, ఎన్నిక‌లు పూర్త‌యినా కూడా, ఫ‌లితాలు విడుద‌లైన త‌రువాత కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరే వ‌ర‌కూ కూడా ముఖ్య‌మంత్రి కొన‌సాగుతారు క‌దా! ప్ర‌భుత్వం ఉంటుంది క‌దా. ఇంకోటి… సాంకేతికంగా చూసుకున్నా, గ‌త అసెంబ్లీ కాల‌ప‌రిమితి మ‌రికొన్నాళ్లు ఉండ‌గానే ఎన్నిక‌లు జ‌రిగాయి. ఎన్నిక‌లకీ ఫ‌లితాల‌కూ మ‌ధ్య‌ న‌ల‌భై రోజుల‌కుపైగా గ్యాప్ ఉంది. ఈలోగా ప్ర‌భుత్వం ఉంటుంది క‌దా! ఎన్నిక‌లు కోడ్ ఉన్నా కూడా… వాటిని ప్ర‌భావితం చేసే విధ‌మైన నిర్ణ‌యాలు మాత్ర‌మే ప్ర‌భుత్వాలు తీసుకోకూడ‌దు. అంతేగానీ, స‌మావేశ మందిరాల‌ను వాడ‌కూడ‌దు, కుర్చీల్లో కూర్చోకూడ‌దు ఇలాంటివి ఉంటాయా..? విజ‌య‌సాయి ఫిర్యాదుపై ద్వివేదీ నుంచి ఎలాంటి స‌మాధానం వ‌స్తుందో చూద్దాం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close