వైసీపీ కార్యకర్తలకు విజయసాయి జాబ్ మేళాలు !

వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించినప్పటికీ ఇంకా చాలా మంది ఖాళీగానే ఉన్నారు. ప్రభుత్వం వచ్చినా మాకేమీ ఉపయోగం లేదని బాధపడుతున్న వారు పెరిగిపోతున్నారు. దీంతో విజయసాయిరెడ్డి జాబ్ మేళాలు ప్లాన్ చేశారు. తిరుపతి, విశాఖ, గుంటూరులో శనివారం జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాల్లో 147 కంపెనీలు పాల్గొంటున్నాయని వేల మందికి ఉద్యోగాలివ్వబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆ కంపెనీలు ఏమిటి.. ఎలాంటి ఉద్యోగాలిస్తారు.. అన్నదానిపై స్పష్టత లేదు. కానీ గతంలో కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇవి ఏర్పాటు చేస్తున్నారు.

చాలా రోజుల నుంచి జాబ్ మేళాల గురించి విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలకు.. విశాఖ ఫార్మాసిటీలో ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత శ్రీకాకుళంలోనూ… అలాంటి మాటే చెప్పారు. స్థానిక ఎన్నికలకు ముందే కార్యకర్తలకు ఉద్యోగాలిప్పిస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. ఇప్పుడు జాబ్ మేళాలు పెడుతున్నారు. అవి కూడా ప్రైవేటు కంపెనీలు. ఇచ్చేది కూడా సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఎక్కువ.

ఉద్యోగాలు చేయాలనుకుంటే.. వారందరూ ఎప్పుడో సీరియస్‌గా ప్రయత్నించి ఉద్యోగాలు చేసుకునేవారని.. వైసీపీ కోసమే వారు ఆ ఉద్యోగ జీవితాన్ని త్యాగం చేశారని.. రాజకీయంగా వారు ప్రాధాన్యత కోరుకుంటున్నారని వైసీపీ వర్గాలంటున్నాయి. అయితే విజయసాయిరెడ్డి మాత్రం.. వారి అసంతృప్తి ఉద్యోగాల కోసమేనన్నట్లుగా ఉన్నారు.. ఎంత మందికి ఉద్యోగాలిప్పిస్తారో వచ్చే రెండు, మూడు రోజుల్లో తేలనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close