మోడీ రూ. 15 లక్షలు..! కానీ విజయసాయిరెడ్డి లెక్క రూ. 20 లక్షలు..!

ఏపీ ప్రజలంతా… తలా ఓ బ్యాంక్ ఖాతాను ప్రారంభించుకోవాలి. ఆల్రెడీ బ్యాంక్ ఖాతాలు ఉంటే పర్వాలేదు. లేక పోతే వెంటనే… వెంటనే ఓపెన్ చేసుకుంటే బెటర్. రేపు ఎన్నికల్లో… పొరపాటున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే.. ఒక్కో ఖాతాలో రూ. 20 లక్షలు జమ చేసే బాధ్యతను.. విజయసాయిరెడ్డి తీసుకుంటున్నారు. అయితే.. ఈ సొమ్మంతా… తండ్రి వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు… దోచిన సొమ్మును తీసుకొచ్చి పంచుతానని చెప్పడం లేదు…కానీ అంత కంటే.. ఎక్కువగా రాబిన్ హుడ్ వేషాలు వేస్తామంటున్నారు విజయసాయిరెడ్డి. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందన్న ఉత్సాహంతో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. ఏపీలో ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు ఇస్తామన్నట్లుగా చెప్పుకొచ్చారు.

దేశవిదేశాల్లోని చంద్రబాబు దొంగ , బినామీ ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే..ఆంధ్రలో ఒక్కొక్కరికీ రూ.20లక్షలు ఇవ్వచ్చని ప్రకటించారు. విజయసాయిరెడ్డి.. తన మాటల్నే ఎన్నికల హామీగా మేనిఫెస్టోలో పెట్టించే అవకాశం కూడా ఉంది. అధినేతకు ఏకైక నమ్మకస్థుడు కాబట్టి .. లెక్కలు రాయడంలో సిద్ధహస్తుడు కాబట్టి… ఈ విషయంలో ఆయనకు పూర్తి క్లారిటీ ఉంటుంది. అధికారంలోకి వస్తే నల్లధనం వెనక్కి తెస్తానని చెప్పిన మోడీ మాట నిలబెట్టుకోలేదు.

మోడీ చేతకానితనం వల్ల తమకు రూ.15లక్షల నల్లధనం వాటా రాలేదని అసంతృప్తిగా ఉన్న ప్రజలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇస్తున్న హామీ..పెద్ద ఊరటలగా కనిపిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో అధికారం రాగానే చంద్రబాబుపై విచారణ చేయించి ఆర్నెల్లలోగా ప్రజలకు రూ.20లక్షలు అందేలా చూస్తామని వైసీపీ చెబితే ఇక దానికి అడ్డేముంటుంది..? . ప్రజలకు ఏమీ చేయకపోయినా.. రూ. 20 లక్షలు ఇచ్చారన్న కృతజ్ఞతతో మరో రెండు సార్లు ఈడీగా గెలిపిస్తారు. ఇంత మంచి ఐడియాను… విజయసాయిరెడ్డి.. ఇంప్లిమెంట్ చేస్తారో లేదో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close