మంటల్లో బెజవాడ కోవిడ్ ఆస్పత్రి..! రోగుల ప్రాణాలు పణం..!

మొన్న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో కోవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగి. రోగులు మరణించిన విషయం కలకలం రేపింది. ఇప్పుడు అలాంటి ఘటనే ఏపీలో జరిగింది. విజయవాడలో.. కోవిడ్ చికిత్స ఆస్పత్రిగా వినియోగిస్తున్న స్వర్ణా ప్యాలెస్ హోటల్లో ఈ ఘటన జరిగింది. మంటలు ఎలా చెలరేగాయో కానీ ఒక్క సారిగా పొగ చుట్టుముట్టడంతో.. అందులో ఉన్న వారు వణికిపోయారు. శ్వాస సమస్యలతోనే అక్కడ చికిత్స పొందుతున్నరోగులు.. ఇబ్బంది పడ్డారు. నలుగురు వరకూ చనిపోయారని.. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు.

విజయవాడలో స్వర్ణా ప్యాలెస్ హోటల్ అంటే తెలియని వారుండరు. లాక్ డౌన్ కారణంగా పూర్తిగా మూసివేశారు. అయితే.. ఇటీవల కరోనా చికిత్స కోసం.. రమేష్ ఆస్పత్రి దాన్ని లీజుకు తీసుకుంది. అనుమతులు తీసుకుని కోవిడ్ ఆస్పత్రిగా మార్చింది. అందులో… నలభై నుంచి 50 మంది వరకూ చికిత్స పొందుతున్నట్లుగా చెబుతున్నారు. ఆస్పత్రిలో ఓ ఇరవై మంది వరకూ.. సిబ్బంది ఉంటారని అంచనా వేస్తున్నారు. అందరూ.. నిద్రపోతున్న సమయంలో మంటలు చెలరేగడంతో… పూర్తిగా పొగ చుట్టుముట్టిన తర్వాతే అగ్నిప్రమాదం గురించి తెలిసింది.

పొగ వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ… గదుల కిటికీల్లోంచి రోగులు.. హాహాకారాలు చేశారు. కాసేపటికి.. అంబులెన్స్‌లు వచ్చాయి. ఉన్న వారందర్నీ… ఇతర ఆస్పత్రులకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే.. మామూలుగా.. కాస్త సీరియస్‌గా ఉన్న వారినే అక్కడ చేర్చి వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడు పొగబారిన పడటంతో.. వారిని కాపాడటానికి మరింత చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అసలు స్వర్ణా ప్యాలెస్‌లో ఎంత మంది కరోనా రోగులు ఉన్నారు..? ఎంత మంది సిబ్బంది ఉన్నారు.. ఆరోగ్య పరిస్థితి ఏమిటి అన్నదానిపై పూర్తి వివరాలను అధికారులు చెప్పడం లేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close