దుర్గమ్మ రథం మూడు విగ్రహాలు టీడీపీ హయాంలో మాయమయ్యాయా..?

విజయవాడ కనకదుర్గమ్మకు సంబంధించిన వెండి రథానికి ఉన్న సింహాల ప్రతిమలు ఎప్పుడు మాయం అయ్యాయి..? ఎవరు మాయం చేశారన్నదానిపై దుమారం రేగుతోంది. వెండి రథానికి నాలుగు వైపులా నాలుగు సింహాల ప్రతిమలు ఉన్నాయి. నాలుగింటిలో మూడింటిని కత్తిరించి తరలించేశారు. మరో సింహపు ప్రతిమ కూడా తీసుకెళ్లడానికి కత్తిరించే ప్రయత్నం చేశారు. ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. విషయం బయటకు రావడంతో దుమారం రేగింది. అయితే.. ఇంద్రకీలాద్రి ఆలయ ఈవో మాత్రం..అసలు అక్కడ సింహపు ప్రతిమలు ఉన్నాయో లేవో రికార్డులు చూసి మూడు రోజుల తర్వాత చెబుతామని చెప్పుకొచ్చారు.

ఆయన నిర్లక్ష్యమైన సమాధానం రాజకీయ పార్టీల విమర్శలకు ఆయుధంగా మారింది. మరో వైపు ఉదయం నుంచి వివిధ రాజకీయ పార్టీల నేతలు.. రథాన్ని పరిశీలించడం ప్రారంభించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకూడా పరశీలించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. అయితే.. ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకు మంత్రి వెల్లంపల్లి ప్రయత్నించారు. ఓ వైపు ఈవో అక్కడ విగ్రహాలు ఉన్నాయో లేవో రికార్డులు చూసి చెబుతామని ప్రకటించారు కానీ మంత్రి వెల్లంపల్లి మాత్రం అవి టీడీపీ హయాంలోనే మాయమైనట్లుగా అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. వెండి రథంలోని సింహాలు మాయంపై కమిటీ ఏర్పాటు చేశారు.

ఈవో, మంత్రి తీరు చూస్తూంటే… మూడు సింహాల దొంగలెవరో మంత్రికి, ఈవోకు తెలుసని టీడీపీ ఆరోపిస్తోంది. మొత్తానికి అంతర్వేది రథం వివాదం సద్దుమణగకముందే ఇంద్రకకీలాద్రి రథం విగ్రహాల మాయం తెరపైకి వచ్చింది. ఈ వివాదం ఇంతటితో అగే అవకాశం కనిపించడం లేదు. అయితే.. అత్యంత విలువైన, పవిత్రమైన రథానికి ఉన్న విగ్రహాలు మాయం అయ్యాయని.. తెలిసిన తర్వాత కూడా.. ప్రభుత్వం ఆలయవర్గాలు స్పందించిన తీరు మాత్రం విమర్శలకు కారణం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close