అన్న క్యాంటీన్ల అవినీతిపై విజయసాయిరెడ్డి విచారణ..!

” 203 అన్న క్యాంటీన్ల నిర్మాణంలో రూ.53 కోట్ల అవినీతి జరిగినట్టు విచారణలో తేలింది…” ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో ప్రకటించారు. రెండు కాంట్రాక్ట్ సంస్థల నుంచి చంద్రబాబు, లోకేష్ కమిషన్లు తీసుకున్నారని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. ఆయన మాటల ప్రకారం… రేపోమాపో కేసులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు రెండో తేదీన కూడా.. విజయసాయిరెడ్డి అన్న క్యాంటీన్లలో అవినీతిపై ట్వీట్ చేశారు. అప్పుడు కేవలం 2 లక్షలతో నిర్మించే అన్న క్యాంటీన్లను ఎన్నికలకు ముందుర ఆదరబాదరగా నిర్మించారని ఒక్కోటి 30-50 లక్షలు ఖర్చయ్యిందని లెక్కలు చెప్పారని ఆరోపించారు.

అన్న క్యాంటీన్లలో టీడీపీ నేతలు దోచుకున్నారని.. ఇందులో రూ. 150 కోట్ల స్కాం జరిగిందని.. అది వెలికితీసేందుకు ఈ క్యాంటీన్లను మూసివేశామని.. నిజాలు తేల్చి ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇప్పుడు దాదాపుగా నెల రోజుల పూర్తయిన తర్వాత మరో సారి అన్న క్యాంటీన్లపై.. ట్వీట్ చేశారు. ఈ సారి ఆగస్టు రెండో తేదీన చెప్పిన రూ. 150 కోట్ల అవినీతిని రూ. 53 కోట్లకు తగ్గించారు. అయితే.. అప్పట్లో అవినీతిని వెలికి తీస్తామని మాత్రమే ప్రకటించారు. ఇప్పుడు వెలికి తీసినట్లుగా ప్రకటించేశారు. విచారణ తేలిందన్నారు. ఇక చర్యలు తీసుకోవడమే మిలిగిందన్నట్లుగా విజయసాయిరెడ్డి ట్వీట్ ఉంది. వైఎస్ జగన్ పాలన ప్రారంభమై వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా… ప్రధానంగా… సాధారణ ప్రజల్లో అన్న క్యాంటీన్లపైనే చర్చ జరుగుతోంది.

మూసివేతపై ప్రజల్లో… అసంతృప్తి ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి .. అన్న క్యాంటీన్ల ట్వీట్ హైలెట్ అవుతోంది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. అసలు .. అన్న క్యాంటీన్లలో అవినీతి జరిగిందనే… దానిపై విచారణ జరపమని… విజయసాయిరెడ్డికి ఎవరు చెప్పారు..? ఏ అధికారంతో విచారణ చేశారు..? ఏ ఆధారాలతో అవినీతి జరిగిందని ఫైనల్ చేశారు..? అవినీతిపై… చంద్రబాబు, లోకేష్‌లను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారనే సందేహాలు చాలా మందిలో వస్తున్నాయి. వీటిపై త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close