టెస్టు క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. తన నిర్ణయాన్ని ముందుగానే బీసీసీఐకి చెప్పాడు. అయితే ఇప్పుడే వద్దని బీసీసీఐ చెప్పింది. కానీ విరాట్ కోహ్లీ తన నిర్ణయానికే కట్టుబడ్డాడు. తన రిటైర్మెంట్ అంశాన్ని సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఈ సందర్భంగా భావోద్వేగ పూరితంగా స్పందించారు. బీసీసీఈ కోహ్లీ నిర్ణయానికి చివరికి అంగీకారం తెలియచేయడంతో ఈ నిర్ణయం ప్రకటించినట్లుగా తెలుస్తోంది.
క్రికెట్లో నేను మొదటిసారి బ్యాగీ బ్లూ జెర్సీ ధరించి 14 సంవత్సరాలు అయిందని.. గుర్తు చేసుకున్నారు. నిజాయితీగా చెప్పాలంటే, ఈ ఫార్మాట్ తనను ఈ స్థాయికి తీసుకు వస్తుందని అసలు ఊహించలేదన్నారు. ఎన్నో కఠినసవాళ్లు, విజయాలతో జీవత పాఠాలను నేర్పిందన్నారు. తెల్ల డ్రెస్ లో ఆడటం ఓ అనుభూతి అన్నారు. ఈ ఫార్మాట్ నుండి నేను వైదొలగాలనుకున్నప్పుడు ఇది సులభం కాదు అనిపించిందన్నారు. అయితే రిటైర్మెంట్ ఇప్పుడు సరైన సమయమని తెలిపారు. తన టెస్టు కెరీర్ లోని ప్రతి క్షణాన్ని ఎప్పటికీ ఆనందంగా గుర్తు చేసుకుంటానని తెలిపారు.
123 టెస్టులు ఆడిన కోహ్లీ 9230 పరుగులు చేశారు. ఏడు డబుల్ సెంచరీలు, 30 సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ 68 టెస్ట్ మ్యాచ్లలో భారత జట్టుకు నాయకత్వం వహించి, 40 విజయాలు సాధించారు. ఇది 58.82 విజయ శాతంతో భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్గా నిలిచాడు.