విశాఖలో రియల్ ఎస్టేట్ పరిశ్రమ ఊహించనంతగా అభివృద్ది చెందుతోంది. శివారు ప్రాంతాల్లో విలువలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అలాంటి ప్రాంతాల్లో అచ్యుతాపురం సెజ్ ఒకటి. అచ్యుతాపురం స్పెషల్ ఎకనమిక్ జోన్ దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక కేంద్రాలలో ఒకటి. ఇక్కడ అనేక బహుళజాతి సంస్థలు, దేశీయ కంపెనీల ఫ్యాక్టరీలు ఉన్నాయి. బ్రాండిక్స్ అపెరల్ సిటీ, రసాయన, ఫార్మా, ఆటోమొబైల్ పరిశ్రమలు ఉన్నాయి.
అచ్యుతాపురం ఒకప్పుడు విశాఖకు కాస్త దూరం అన్న భావన ఉండేది. ఇప్పుడు విశాఖ శివారు అని చెప్పుకుంటున్నారు. పారిశ్రామిక కేంద్రంగా మారడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, విల్లా ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నారు. ఓపెన్ ప్లాట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. NH-16 సమీపంలో , SEZ సమీపంలో ఉన్న ప్లాట్లు డిమాండ్ ఎక్కువగా ఉంది. చదరపు గజానికి 12,000 నుండి 20,000 వరకుధర పలుకుతోంది. గేటెడ్ కమ్యూనిటీల్లో అయితే మరింత రేటు ఎక్కువగాఉంది.
ఇక అపార్టుమెంట్లు మధ్యతరగతికి అందుబాటులో ఉన్నాయి. 800-1200 చదరపు అడుగులు ఉంటే అపార్టుమెంట్ 30 లక్షల నుండి 50 లక్షల వరకు ఉన్నాయి. కాస్త లగ్జరీ కోరుకుంటే దానికి తగ్గట్లుగా రేట్లు ఉన్నాయి. 3,500 నుండి 5,000 రూపాయల వరకూ ధరలు చెబుతున్నారు. విల్లాలు, వాణిజ్య స్థలాలకూ డిమాండ్ ఎక్కువగా ఉంది. అచ్యుతాపురం రియల్ ఎస్టేట్ మార్కెట్ గత 5-7 సంవత్సరాలలో 10-15 శాతంవార్షిక ధరల పెరుగుదల నమోదు చేసింది. అంటే మంచి రిటర్న్స్ వస్తున్నట్లుగానే భావించవచ్చు.
అచ్యుతాపురం రియల్ ఎస్టేట్ మార్కెట్ రాబోయే 5-10 సంవత్సరాలలో మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. కొత్త పారిశ్రామిక యూనిట్ల స్థాపన, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, , ప్రభుత్వ మౌలిక సదుపాయాల పెట్టుబడులు ఈ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు హాట్స్పాట్గా మారుస్తున్నాయి.