రాష్ట్ర విభజనపై చర్చ – జగన్ కి ఉండవల్లి లేఖ !

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కేంద్రం వద్ద బయటకు రాకుండా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా..? ఆయన జగన్ కు తాజాగా రాసిన లేఖ చూస్తే అలాగే అనుకోవాలి. రాష్ట్ర విభజనపై ప్రధాని, హోంమంత్రి చేసిన వ్యాఖ్యల గురించి.. గురువారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చించాలని ఎంపీలతో ఆందోళన చేయించాలని.. ఉండవల్లి లేఖలో కోరారు. పార్లమెంట్ తలుపులు మూసి మరీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించారని… ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేశారని.. విభజన అక్రమంగా జరిగిందన్న అర్థంలో.. గతంలో మోడీ, అమిత్ షా ప్రకటనలు చేశారు. పార్లమెంట్‌లోనూ ఓ సారి మోడీ ఆ వ్యాఖ్యలు చేశారు.

ఇక ఎన్నికల ప్రచారంలోనూ.. విభజన అంశాన్ని చాలా సార్లు మోడీ ప్రస్తావించి.. పద్దతి లేకుండా.. విభజించి.. ఏపీ ప్రజలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని విమర్శలు గుప్పించారు. వీటిపైనే పార్లమెంట్‌లో ప్రస్తావించాలని.. ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ ను కోరుతున్నారు. నిజానికి విభజన జరిగిన తీరు చెల్లదంటూ.. ఉండవల్లి కోర్టుల్లో పిటిషన్లు వేసి వాయిదాలకు హాజరవుతున్నారు. ఇప్పుడీ విషయంలోకి జగన్ ను లాగాలని ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ.. ఎంపీలు కానీ.. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధుల విషయంలోనే.. కేంద్రాన్ని ఒక్క మాట అడగలేకపోతున్నారు.

అలాంటిది నేరుగా.. మోడీ, షాలు.. విభజన చేసిన వ్యాఖ్యల గురించి చర్చ పెట్టాలని అడగలరా..?… అడిగితే ఆ తర్వాత పరిణామాలను ఎవరైనా ఊహించగలరు. అన్నీ తెలిసి కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ .. జగన్ కు లేఖ రాశారు. అంటే.. జగన్ ను టీజ్ చేద్దామన్న ఉద్దేశం అయినా ఉండొచ్చు లేకపోతే.. జగన్ ధైర్యంపై ఆయనకు గట్టి నమ్మకం అయినా ఉండొచ్చని అంటున్నారు. ఒక వేళ జగన్ ధైర్యం పై ఉండవల్లికి నమ్మకం ఉందనుకుంటే… ఆ నమ్మకాన్ని జగన్ నిలబెట్టుకుంటారో లేదో మరి..!?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close