ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం పాపం చేశారు – ఉండవల్లి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీలు ఇప్పుడు వెనక్కు తగ్గితే చరిత్ర క్షమించదని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. ఆయన ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. నరేంద్రమోడి-చంద్రబాబు భేటి తీవ్రఅసంతృప్తిని మిగిల్చిందని అన్నారు. ఏపీ ప్రజలు ఏం తప్పు చేశారు…ఏం పాపం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు ఏదో మంచి వార్తతో వస్తారనుకుంటే తలదించుకుని వచ్చారని అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుకంటే ఇది ఇంకా అవమానమని చెప్పారు. విభజన చట్టంలోని హామీల అమలుకు రోడ్ మ్యాప్ ఎందుకని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా అనేది ఏపీ ప్రజల సెంటిమెంట్ అన్నారు. మోడికి నచ్చితే ఏమైనా చేస్తారని, మరి మోడికి చంద్రబాబు నచ్చటంలేదా అని అడిగారు. రాష్ట్రాన్ని అంతా కలిసి పాతాళంలోకి తొక్కేస్తున్నారని ఆరోపించారు. 15వేలకోట్ల రెవెన్యూలోటుకుగానూ 2500 కోట్లు మాత్రమే ఇస్తారా అని అడిగారు. ప్రణాళికా సంఘం చెప్పింది వేదం కాదు సలహా మాత్రమేనని అన్నారు. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హోదా ఇస్తామని చెప్పి ఇప్పుడెందుకు వెనక్కు తగ్గుతున్నారని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదాను ప్రకటించకుండా, ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని చెప్పటం విడ్డూరంగా ఉందని ఉండవల్లి అన్నారు. నిశ్చితార్థం చేసుకున్న తర్వాత, మగపెళ్ళివారు – పెళ్ళి అచ్చిరాదు, అమ్మాయిని కాపురానికి పంపండి, పెళ్ళి అయితే ఏమి సౌకర్యాలుంటాయో అన్నీ ఇస్తామని అలానే చూసుకుంటామని అంటే చెప్పు తీసుకుని కొడతారని చెప్పారు. ఇప్పుడు ఇస్తామంటున్న ప్యాకేజికూడా అలాంటిదేనని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close