అక్కడి పాలు, నీళ్లు, పంటలు కలుషితం.. వాడొద్దు..!

ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల పరిధిలో పండిన పంటలను వాడకూడదని.. కాలుష్య నిపుణుల బృందం సిఫార్సు చేసింది. కేంద్రం నియమించిన సీఎస్‌ఐఆర్‌- ఎన్‌ఈఈఆర్‌ఐ నిపుణుల బృందం అక్కడి గ్రామాలన్నింటినీ పరిశీలన జరిపి.. కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఐదు గ్రామాల్లోని పశువుల నుంచి సేకరించిన పాలు తాగడం కూడా మంచిది కాదని.. నివేదికలో స్పష్టం చేసింది. ఆయా గ్రామాల్లో పెరిగిన గడ్డిని కూడా ..పశువులకు ఆహారంగా ఇవ్వొద్దని తెలిపింది. తాగు, వంట కోసం బహిరంగ జల వనరులు వాడొద్దని స్పష్టంచేసింది. ప్రభావిత ప్రాంతాలను సోడియం హైడ్రోక్లోరైడ్‌ ద్రావణంతో శుభ్రపరచాలని వాహనాలను సైతం శుభ్రపరిచాకే వాడాలని నిపుణులు తేల్చారు.

ఎల్డీ పాలిమర్స్ చుట్టుపక్కల ఐదు గ్రామాల ప్రజల ఆరోగ్యంపై గ్యాస్ లీక్ తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. విష వాయువు ప్రభావానికి గురైన వారు సంవత్సరం పాటు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలన్నారు. అక్కడ ఇళ్లలో స్టైరిన్ అత్యధికంగా ఉందని..నివాసాలు పూర్తిగా శుభ్రపరిచాకే తిరిగి వెళ్లాలని నిపుణుల బృందం సూచించింది. విశాఖకు నీరు అందించే మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ సమీపంలోనే ఉంది. నిపుణులనివేదిక ప్రకారం.. ఈ నీటిని ఇక ఉపయోగించుకోలేరు.

గ్యాస్ లీక్ ఐదు గ్రామాల ప్రజల జీవన విధానాన్నే మార్చేయనుంది. అక్కడి ప్రజలకు దీర్ఘ కాలంలో ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదమే కాదు.. జీవనాధారం అయిన వ్యవసాయం, పశుసంపద కూడా…పనికి రాకుండా పోయింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అందరూ గ్రామాలకు వెళ్లవచ్చని చెప్పింది. దాంతో ఇప్పటి వరకూ..స్కూళ్లలో..ఇతరచోట్ల షెల్టర్ తీసుకున్న జనం గ్రామాలకు వెళ్తున్నారు. కానీ అక్కడ స్వచ్చమైన గాలి లేదని… నివేదికలు వస్తూండటంతో భయందోళనలకు గురవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close