ప్రజలతో సంబంధం లేకుండా ఏపీ బీజేపీ బలపడుతుందా..?

కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి… ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఏపీలో బీజేపీ బలపడుతుందని.. ఇక అధికారంలోకి రావడమే తరువాయి అన్నట్లుగా ప్రసంగించారు. అంత వరకూ బాగానే ఉంది కానీ…  అసలు ఎలా బలపుడుతుందనే సందేహం చాలా మందికి వచ్చింది. ఎందుకంటే..ఏపీ బీజేపీ నేతలు.. ఒక్కరంటే.. ఒక్కరైనా ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారా.. పోరాడుతున్నారా..అని దుర్భిణి పెట్టి వెదికినా ప్రయోజనం లేకుండా పోతోంది మరి. రాజధానికి మద్దతు అంటూ.. బీజేపీ చేస్తున్న విన్యాసాలు.. ప్రజల్లో ఆ పార్టీపై మరింత వ్యతిరేకత పెంచాయి కానీ తగ్గించలేదు. కానీ అదే విధానాన్ని అనుసరిస్తోంది. తాజాగా వైసీపీ నేతలతో పోటీ పడి… అమరావతి మహిళలపై దురుసుమాటలు కూడా మాట్లాడుతున్నారు.

ఏక ప్రతిపక్షంగా కనీసం.. అధికార పార్టీపై విమర్శలు చేయాలి. అయితే.. బీజేపీ నేతలు మొహమాట పడుతున్నారు. ఏపీ సర్కార్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలపై ప్రజల ఉపాధి దెబ్బతింటోంది.. వారిపై పన్నుల భారం పెరుగుతోంది. రోడ్లు అధ్వాన్న స్థితికి చేరాయి. కానీ రిపేర్లు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడటం లేదు. వర్షాలు.. వరదలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. సాయం అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంలోనూ విఫలమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ప్రభుత్వంపై పోరాడటానికి అనేక ప్రజాసమస్యలు ఉన్నాయి. కానీ బీజేపీ నేతలు…  మాత్రం..  వేటినీ పట్టించుకోవడం లేదు. కానీ తాము బలపడిపోతున్నామని.. అధికారంలోకి వచ్చేస్తామని ఆశ పడుతున్నారు.

బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేన సైలెంటయిపోయింది. ఆ పార్టీని నియంత్రిస్తూ.. వైసీపీకి మరింత మేలు చేస్తున్నారు కానీ.. బీజేపీ నేతలు.. సొంతంగా ఎదిగే ప్రయత్నమే చేయడం లేదు. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు. కన్నా లక్ష్మినారాయణ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు.. ప్రభుత్వంపై విరుచుకుపడుతూ… ఉండేవారు. దాని వల్ల బీజేపీ ఎప్పుడూ మీడియాలో పోరాడుతున్నట్లుగా ఉండేది. కానీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు వచ్చాక.. వైసీపీకి అనుబంధ సంస్థగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆశలు పెట్టుకోవడంలో తప్పు లేదు.. కానీ సాధించాలంటే… ఎంతో కష్టపడాలి.. ఆ నైజం ఏపీ బీజేపీ నేతల్లో కనిపించడం లేదనేది.. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close