కేసీఆర్‌ను మోదీ లైట్ తీసుకుంటారా ? విమర్శిస్తారా ?

హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న మోదీ .. బీఆర్ఎస్ పై ఎలాంటి వ్యూహం అమలు చేస్తారన్నది కీలకంగా మారింది. గతంలో ఆయన భారీ విమర్శలు చేసిన సందర్భాలు లేవు. గతంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభంలో పరోక్షంగా కొన్ని విమర్శలు చేశారు కానీ ఘాటు రేంజ్‌కు ఎప్పుడూ వెళ్లలేదు. గతంలో మునుగోడులో ఉప ఎన్నికలు ఉన్నా.. విమర్శలకు మోదీ దూరంగా ఉన్నారు. అప్పట్లో మోదీ విమర్శల దాడి చేస్తారని బీఆర్‌ఎస్‌ నేతలు భావించారు. ముందే కేసీఆర్‌ సభను ఏర్పాటు చేసి తీవ్ర విమర్శలు చేశారు. కానీ మోదీ వారి అంచనాలను తలకిందులు చేశారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. బీజేపీని బీఆర్ఎస్ దారుణంగా టార్గెట్ చేస్తోంది. మోదీ, అమిత్‌ షా వచ్చినప్పుడు అవమానకరంగా ఫ్లెక్సీలతోనూ యుద్ధం చేస్తున్నారు. ప్రతిపక్ష కూటమికి తనను చైర్మన్‌ను చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఖర్చంతా తానే భరిస్తానని సీఎం కేసీఆర్‌ ఆఫర్ ఇచ్చారని జాతీయ స్థాయిలో ప్రచారం జరిగింది. మోదీ సర్కారును కూల్చడమే ధ్యేయంగా కేసీఆర్‌ పావులు కదుపుతున్నారని బీజేపీ నేతలూ విమర్శలు గుప్పిస్తున్నారు.

అలాగే, రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేసిన తర్వాత కేంద్రంలో ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకు బీఆర్‌ఎస్‌ నేతలూ హాజరవుతున్నారు. దాంతో, తన సమాధి తవ్వడానికి అవినీతిపరులంతా ఏకమవుతున్నారని మోదీ కూడా విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ తెలంగాణ పర్యటనలో కేసీఆర్ ను విమర్శించకుండా తమ ప్రభుత్వ విజయాలను చెప్పుకుని వెళ్లిపోతే… బీజేపీ నేతలు కూడా డీలా పడే అవకాశం ఉంది. అయితే జరుగుతోంది బీజేపీ కార్యక్రమం కాదని అధికారిక కార్యక్రమం అని కొంత మంది గుర్తు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close