కేసీఆర్‌ను మోదీ లైట్ తీసుకుంటారా ? విమర్శిస్తారా ?

హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న మోదీ .. బీఆర్ఎస్ పై ఎలాంటి వ్యూహం అమలు చేస్తారన్నది కీలకంగా మారింది. గతంలో ఆయన భారీ విమర్శలు చేసిన సందర్భాలు లేవు. గతంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభంలో పరోక్షంగా కొన్ని విమర్శలు చేశారు కానీ ఘాటు రేంజ్‌కు ఎప్పుడూ వెళ్లలేదు. గతంలో మునుగోడులో ఉప ఎన్నికలు ఉన్నా.. విమర్శలకు మోదీ దూరంగా ఉన్నారు. అప్పట్లో మోదీ విమర్శల దాడి చేస్తారని బీఆర్‌ఎస్‌ నేతలు భావించారు. ముందే కేసీఆర్‌ సభను ఏర్పాటు చేసి తీవ్ర విమర్శలు చేశారు. కానీ మోదీ వారి అంచనాలను తలకిందులు చేశారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. బీజేపీని బీఆర్ఎస్ దారుణంగా టార్గెట్ చేస్తోంది. మోదీ, అమిత్‌ షా వచ్చినప్పుడు అవమానకరంగా ఫ్లెక్సీలతోనూ యుద్ధం చేస్తున్నారు. ప్రతిపక్ష కూటమికి తనను చైర్మన్‌ను చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఖర్చంతా తానే భరిస్తానని సీఎం కేసీఆర్‌ ఆఫర్ ఇచ్చారని జాతీయ స్థాయిలో ప్రచారం జరిగింది. మోదీ సర్కారును కూల్చడమే ధ్యేయంగా కేసీఆర్‌ పావులు కదుపుతున్నారని బీజేపీ నేతలూ విమర్శలు గుప్పిస్తున్నారు.

అలాగే, రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేసిన తర్వాత కేంద్రంలో ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకు బీఆర్‌ఎస్‌ నేతలూ హాజరవుతున్నారు. దాంతో, తన సమాధి తవ్వడానికి అవినీతిపరులంతా ఏకమవుతున్నారని మోదీ కూడా విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ తెలంగాణ పర్యటనలో కేసీఆర్ ను విమర్శించకుండా తమ ప్రభుత్వ విజయాలను చెప్పుకుని వెళ్లిపోతే… బీజేపీ నేతలు కూడా డీలా పడే అవకాశం ఉంది. అయితే జరుగుతోంది బీజేపీ కార్యక్రమం కాదని అధికారిక కార్యక్రమం అని కొంత మంది గుర్తు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేది నిజం – మోదీ, షాలతో భేటీ డౌట్ !

లండన్ లో ఉండి చంద్రబాబును అరెస్టు చేయించి ఇండియాకు రాక ముందే ఢిల్లీ పర్యటన పేరుతో ప్రచారం చేసుకుని మోడీ , షాలతో భేటీ అవుతారని ప్రచారం చేయించుకున్న జగన్ రెడ్డి తాపత్రయం...

చంద్రబాబుకు డబ్బు ముట్టినట్లు ఆధారాలున్నాయా ?: ఏసీబీ కోర్టు జడ్జి

చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, అలాగే బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది. ఉదయం చంద్రబాబు తరపు లాయర్ దూబే, మధ్యాహ్నం...

సుధీర్ బాబుకి ‘హంట్’ నేర్పిన గుణపాఠం

సుధీర్ బాబు 'హంట్' సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. కెరీర్ లో పలు ప్రయోగాలు చేసిన సుధీర్ బాబు.. హంట్ కూడా తనకు మరో ప్రయోగాత్మక చిత్రం అవుతుందని బలంగా నమ్మాడు....

కేసీఆర్ సుదీర్ఘ డిమాండ్లన్నీ తీర్చేసిన మోదీ !

తెలంగాణ ఎన్నికలకు షెడ్యూల్ రేపోమాపో రానున్న సమయంలో కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ప్రత్యేకంగా తెలంగాణ కోసమే జరిగిందా అన్నట్లగా నిర్ణయాలు తీసుకున్నారు. పసుపుబోర్డు ఏర్పాటును ముందు బహిరంగలో ప్రకటించారు. తాజాగా కేబినెట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close