పోస్టింగ్‌లతో ఐఏఎస్, ఐపీఎస్‌లలో అలజడి !

ఏపీలో రెండు రోజులుగా ఐఏఎస్, ఐపీఎస్‌లను పెద్ద ఎత్తున బదిలీ చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల ప్రచారం.. వచ్చే ఎన్నికలకు అనుకూలమైన అధికారుల నియామకం అని ఎక్కువ మంది భావిస్తూండటంతో పోస్టింగ్‌లు పొందుతున్న వారికి ఇరకాటంగా మారింది. తాము ప్రభుత్వానికి సన్నిహితులమని ఇతర పార్టీలు నమ్మితే తమ కెరీర్‌కు గ్రహణం పడుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. కీలక పోస్టింగ్‌లు పొందిన వారిలో చాలా మంది.. ప్రభుత్వం చెప్పినట్లుగా చేయాల్సి వస్తుందని.. అలా చేయడం అంటే చిక్కులు తెచ్చి పెట్టుకోవడమేనన్న ఆందోళనలో ఉన్నారు

ఈ ప్రభుత్వ పెద్దలు ఏదీ నిబంధనలకు అనుగుణంగా చేయమని చెప్పరని స్వార్థ ప్రయోజనాల కోసం నిబంధనలను ఉల్లంఘిచి నిర్ణయాలు తీసుకోవాలని ఒత్తిడి తెస్తారని ఇప్పటి వరకూ ఎదురైన అనుభవాలతో సివిల్ సర్వీస్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల కోసం చేసే సన్నాహాల్లో.. ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తే తాము టార్గెట్ అయిపోతామని అంటున్నారు. నిజానికి ఏపీ ప్రభుత్వం తాము చెప్పినట్లుగా చేసే అతి కొద్ది మంది సివిల్ సర్వీస్ అధికారులకే ప్రాధాన్యం ఇచ్చి చేయాలనుకున్నవన్నీ వారితోనే చేయిస్తుంది. అలా కొంత మంది తీవ్ర వివాదాస్పదం అయ్యారు. వారి భవిష్యత్ ఏలా ఉంటుందన్నది … అధికార వర్గాల్లోనే విస్తృత చర్చ జరుగుతోంది.

ఇటీవలి కాలంలో కొంత మంది అధికారులు తాము నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తామని బదిలీ చేసినా పోస్టింగ్ ఇవ్వకపోయినా పర్వాలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారింది. గతంలో కలెక్టర్ పోస్టుల కోసం లాబీయింగ్ జరిగేది. ఈ ప్రభుత్వంలో కలెక్టర్ పోస్టు కోసం ప్రయత్నించే ఐఏఎస్‌లు కూడా తగ్గిపోయారు. అలాగే ఎస్పీ పోస్టులకు కూడా. సిఫార్సులు తగ్గిపోయాయి. ఇప్పుడు పోస్టులు పొందిన వారు కూడా.. తాము ప్రభుత్వానికి సన్నిహితులమే ముద్ర పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close