ప్రొ.నాగేశ్వర్: 2019లో నరేంద్రమోడీకి పోటీ ఎవరు..?

ఉపఎన్నికల్లో ప్రతిపక్షల ఐక్యత బీజేపీపై తీవ్ర ప్రభావం చూపించింది. బీజేపీ పునాదులను దాదాపుగా దెబ్బతీసింది. వచ్చే ఎన్నికల నాటికి.. బీజేపీకి ఈ ప్రాంతీయ పార్టీల ప్రధాన ప్రత్యర్థిగా ఎదురు నిలుస్తాన్న ప్రచారం జరుగుతోంది.్ందుకే బీజేపీ మద్దతు దారులు ఓ వాదన బలంగా వినిపిస్తున్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీ ఉంటారు… విపక్షాల తరపున ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరు మోదీని ఢీకొడతారన్న..వాదనను తెర ముందుకు తెస్తున్నారు.

రాహుల్ గాంధీకి పూర్తి ఆమోదం లేదు..!

ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో విపక్షాలన్నీ ఏకమయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పెట్టుకోలేదు. కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ వస్తే తానే ప్రధానమంత్రి అవుతానని కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాందీ ప్రకటించారు. కానీ వెంటనే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా.. కొన్ని సందేహాలు లేవనెత్తాయి. ఎందుకంటే.. మమతా బెనర్జీతో పాటు ఎన్సీపీ నేత శరద్ పవార్ కూడా.. ప్రధానమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అలాగే సమాజ్ వాదీ పార్టీకి కూడా కొన్ని పరిమితులు పెట్టింది. ఈ పార్టీలకు పరిమితులు ఉండటానికి కొన్ని కారణాలున్నాయి.

పీఎం పోస్ట్‌పై ఆశలు పెట్టుకున్న నేతలు ఎక్కువే..!

అందులో ఒకటి… ఆయా పార్టీల నేతలకు ప్రధానమంత్రి పదవిపై ఆశ ఉండటం. రెండోది… కాంగ్రెస్‌ నాయకత్వాన్ని అంగీకరిస్తే.. తమ రాష్ట్రంలో తమ పార్టీపై ఎలాంటి ప్రబావం ఉంటుదోనన్న ఆందోళన. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా అంగీకరించలేవు. ఎందుకంటే.. రాహుల్ ను ప్రధానమంత్రిగా ప్రకటిస్తే కాంగ్రెస్ బలపడుతుంది. ఈ రెండు పార్టీలకూ కాంగ్రెస్ యూపీలో బలపడటం ఇష్టం లేదు. కాంగ్రెస్ బలపడితే .. ఆ ప్రభావం ఈ పార్టీలపై పడుతుంది. బెంగాల్‌లో మమతా బెనర్జీ పరిస్థితి కూడా అంతే. తమ రాష్ట్రంలో కాంగ్రెస్ పెరగకూడదని ఆమె కోరుకుంటున్నారు. అందు వల్ల బీజేపీ నేతలు… నరేంద్రమోదీకి ఢీకొట్టే… నేత ఎవరో చెప్పాలంటూ.. సవాల్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించే స్థితిలో విపక్షాలు లేవు.

ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్థి ఉండరు..!

దీనికి ప్రతిపక్షాల వద్ద ఇప్పటికప్పుడు సమాధానం లేదు. ఇందిరాగాంధీ అత్యంత బలంగా ఉన్నప్పుడు… కూడా ఆమెకు వ్యతిరేకంగా కూటమి కట్టాయి. అప్పుడు ప్రాంతీయ పార్టీలు కూడా బలంగా లేవు. జనతా పార్టీనే అందర్నీ కూడగట్టింది. అప్పుడు కూడా కాంగ్రెస్ నేతలు.. తమ ప్రధానమంత్రి అభ్యర్థి ఇందిరాగాంధీ.. మీకెవరు అంటూ.. ప్రశ్నించడం ప్రారంభించారు. కానీ అప్పుడు కూడా జనతా పార్టీ నేతలు సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే.. అప్పుడు చాలా మంది నేతలు ఇందిరాగాందీకి వ్యతిరేకంగా పోరాడుతూ.. ప్రధానమంత్రి పదవి కోసం రేసులో ఉన్నారు. వారిలో ఎవరో వారు తేల్చుకోలేకపోయారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం… ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించుకున్నారు. రెండో ఉదాహరణ..వాజ్‌పేయి ప్రదానమంత్రిగా ఉన్న సమయంలోనూ.. ఇలాంటి పరిస్థితి కాంగ్రెస్‌కు వచ్చింది. తమకు వాజ్‌పేయి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నారు మీకెవరు అంటూ.. బీజేపీ నేతలు కాంగ్రెస్‌ నేతలను టీజ్ చేశారు. సోనియాపై విదేశీ వనిత ముద్ర ఉండటంతో పాటు రాహుల్ గాంధీ కూడా రాజకీయాలకు సిద్దం కాలేకపోయారు.

నాయకులు చరిత్రను సృష్టించరు. చరిత్ర నాయకుల్ని సృష్టిస్తుంది…!

కానీ ప్రజలు ఇవేమీ పట్టించుకోకుండా… ప్రధాని అభ్యర్థితో సంబంధం లేకుండా.. యూపీఏ అధికారం ఇచ్చారు. యూపీఏ తరపున మన్మోహన్ ప్రధాని అయ్యారు. రాజకీయాల్లో బలమైన నాయకుడు ఎవరు అన్నప్పుడల్లా ప్రత్యామ్నాయం చర్చ జరిగింది. కానీ ఎప్పటికప్పుడు నాయకులు పుట్టుకుంటూనే వచ్చారు. నాయకులు చరిత్రను సృష్టించరు. చరిత్ర నాయకుల్ని సృష్టిస్తుంది. తెలంగాణ ఉద్యమం కేసీఆర్ ను నాయకుడ్ని చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ సృష్టించలేదు. బీజేపీయేతర పక్షాలకు.. ప్రధానమంత్రి అభ్యర్థి లేరు. భారత దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఎంపీలు ఎన్నికవుతూంటారు. ప్రధానమంత్రి అభ్యర్థిని బట్టి కాదు. గత ఎన్నికల్లో చూసుకుంటే.. దక్షిణాదితో పాటు.. బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా మోదీ మానియాను చూసి ఎవరూ ఓటేయలేదు.

ఎన్నికల ఫలితాలను బట్టే ప్రధాని..!

రేపు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిస్తే.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకొస్తారు. ప్రాంతీయ పార్టీలన్నీ అత్యధిక స్థానాలు గెలిస్తే.. వారి నుంచే ఓ ప్రధానమంత్రి వస్తారు. అంటే…ప్రజల తీర్పు నుంచే ప్రధాని వస్తారు.. తప్ప ప్రధానే ప్రజల తీర్పును నిర్ణయించరు. కర్ణాటకలో బీజేపీ తరపున యడ్యూరప్పను, కాంగ్రెస్ తరపున సిద్ధరామయ్యను సీఎం అభ్యర్థులుగా ప్రకటించారు. కానీ ప్రజల తీర్పును బట్టి .. కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. దీన్ని బట్టి చూస్తే ప్రజాతీర్పును బట్టే ప్రధానమంత్రులవుతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.