కర్ణాటకంపై సుప్రీం తీర్పు ఎవరికి “బలం.”.?

కర్ణాటక అసెంబ్లీలో రేపు బలపరీక్ష జరగనుంది. ఈ క్రమంలో … బీజేపీ, కాంగ్రెస్ వ్యూహకర్తలు బెంగళూరులో మకాం వేశారు. సుప్రీంకోర్టు … రెండు పార్టీలు తమకు అనుకూలంగా చెప్పుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులో ప్రధానంగా రెండు అంశాలున్నాయి. ముంబైలో బస చేసిన రెబెల్ ఎమ్మెల్యేలకు కోర్టు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. విధిగా సభకు హాజరు కావాలని వారిని నిర్బంధించలేమని, సభకు రావాలా వద్దా అన్నది వారిష్టమని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఇది రెబెల్స్ కు పూర్తి ఉరటేనని భావిస్తున్నారు. సభకు గైర్హాజరు కావడం ద్వారా కుమారస్వామి ప్రభుత్వాన్ని మైనార్టీలో పడెయ్యాలన్న వారి ఆలోచన నెరవేరే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.

స్పీకర్‌కు ఇబ్బంది కలిగే తీర్పు వస్తుందని ఎదురు చూసిన వారికి నిరాశ తప్పలేదు. నిర్దిష్ట కాలపరిమితిలో రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించడం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది.రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహారంలో నిర్ణయాన్ని స్పీకర్ రమేష్ కుమార్‌కు వదిలేస్తున్నట్లు ప్రకటించింది. ఆయన ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడే ..!. అయితే.. సుప్రీంకోర్టు.. ఎమ్మెల్యేలను.. బలపరీక్షకు వెళ్లాలా వద్దా.. అన్నది వారిష్టమని… బలవంతం చేయలేరని.. తీర్పు చెప్పింది. దీంతో.. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయలేరనే వాదన బీజేపీ తెరపైకి తీసుకు వచ్చిది. వాళ్లు సభకు హాజరు కావాలన్న నిబంధన లేదని .. కుమారస్వామి ప్రజా మద్దతు కోల్పోయారు సభలో మెజార్టీ నిరూపించుకోలేకపోతే ఆయన రాజీనామా చేయాల్సిందేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. నిర్ణయం విషయంలో స్పీకర్‌కు సంపూర్ణ అధికారాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే విప్ విషయంలో… సుప్రీం తీర్పు అన్వయంతో.. భవిష్యత్తులో స్పీకర్ అధికారాలను సుప్రీం కోర్టు నిర్ణయిస్తుంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కొత్త ట్రెండ్‌కు తెరలేస్తుందన్న ప్రచారం జరుగుతోంది.

మరో వైపు.. అసెంబ్లీలో ఎవరి బలాలు ఎంత అన్నదానిపై చర్చ జరుగుతోంది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలున్నాయి. ఇందులో బీజేపీ-105, కాంగ్రెస్-78, జేడీఎస్‌కి 37 స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 113. ప్రస్తుతం కాంగ్రెస్-జేడీఎస్‌లకు 115 మంది ఎమ్మెల్యేలున్నారు. బీఎస్పీ, ఇద్దరు స్వతంత్రులు, నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిపి ఆ బలం 119కి పెరిగింది. ఐతే, 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సర్కార్ మైనార్టీలో పడింది. వారు సభకు రాబోమని చెబుతున్నారు. వారు రాకపోతే.. బీజేపీ బలం 106 దగ్గర ఉంటుంది. కాంగ్రెస్ – జేడీఎస్ కు 103 మంది సభ్యులు ఉంటారు. కనీసం.. ఐదారుగురు ఎమ్మెల్యేలను అయినా రెబెల్ క్యాంప్ నుంచి తీసుకొచ్చి ఓటింగ్ లో పాల్గొనేలా చేస్తే ప్రబుత్వం బయటపడే అవకాశం ఉంది. ఏం చేసినా.. రేపు బెంగళూరులో పొలిటికల్ డ్రామా ఖాయమనిచెప్పుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close