వివేకా హత్య కేసు సూత్రధారి ఓ “శివగామి” !?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కు అసలు సూత్రధారిని సీబీఐ కనిపెట్టారని.. ఆ సూత్రధారికి సంబంధించిన ఆధారాల కోసమే ఆగుతున్నారన్న ప్రచారం పులివెందులలో విస్తృతంగా జరుతోంది. వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను అరెస్ట్ చేస్తే కేస్ క్లోజ్ అయిపోతుందనుకుంటే… జగన్ ఎప్పుడో చేయనిచ్చేవారని.. కానీ ఆ కేసు తర్వాత ఓ శివగామి వద్దకు వస్తుందనే .. కేసును ముందుకు వెళ్లకుండా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయం కడప జిల్లాలో సంచలనంగా మారింది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మొదటి నుంచి సంచలనాత్మకంగా మారింది. ఎందుకంటే అంతా బహిరంగమే .. కానీ ఒక్కరూ బయటకు చెప్పరు. ఎవరు చేశారు.. ఎలా చేశారు.. ఎందుకు చేశారు.. అంతా ఓపెన్ సీక్రెట్. కడప ప్రజలందరూ.. తమ పిచ్చాపాటి కబుర్లులో అసలు హంతకులెవరో చెప్పుకుంటూ ఉంటారు. అయితే కేసులు పెట్టడానికి అరెస్ట్ చేయడానికి కావాల్సింది సాక్ష్యాలు. ఈ విషయంలో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను అరెస్ట్ చేయడానికి కావాల్సిన సాక్ష్యాలున్నాయి. కానీ ఇంకా అరెస్ట్ చేయడం లేదు.

సీబీఐ అధికారులు వివేకా హత్య కేసుకు సంచలన ముగింపు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.అందుకే ఈ హత్య కేసులో అసలు సూత్రధారిని బయటకు తీయాలని పట్టుదలగా ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇది బయటపడితే రాజకీయంగానూ సంచలనం అవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి సీబీఐ సైలెంట్‌గా ఉంది.. ఏం చేస్తుందనేది ఎవరికీ తెలియడంలేదు. కానీ వీరోచితంగా ముందడుగా వేసి… వైఎస్ వివేకా హత్య కేసు నిందితుల్ని పట్టుకోవాలంటే.. సంచలనాలు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close