పవన్ స్పందన… బాబును కార్నర్ చేస్తుందా?

జనసేన అధినేతకు మరోసారి చిక్కు వచ్చి పడింది. మిగతా అన్ని విషయాలపై…మరీ ముఖ్యంగా ఉత్తర-దక్షిణం అంటూ లేని సమస్యలపై తక్షణమే స్పందించే పవన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబునాయుడికి చెడ్డపేరు తెచ్చే విషయాలపైన మాత్రం అస్సలు స్పందించడు. చిన్నపాటి వర్షానికే సచివాలం, అసెంబ్లీలోకి నీరు ప్రవేశించిడం చంద్రబాబు ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తోంది. వైఎస్ జగన్ ఛాంబర్‌లోకి నీళ్ళు రావడాన్ని జగన్ కుట్రగా తిప్పికొట్టే ప్రయత్నాన్ని గట్టిగానే చేస్తున్నారు కానీ సచివాలయంలోకి కూడా నీళ్ళు వచ్చిన విషయాన్ని సమర్థించుకోలేకపోతున్నారు. అన్నింటికీ మించి సచివాలయం, అసెంబ్లీలోకి మీడియాను ఎందుకు అనుమతించడం లేదు అనే ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు.

చిన్న వర్షానికే రాజధాని భవనాలు లీక్ అయ్యాయన్న వార్త ఆంధ్రప్రదేశ్ జనాలను బాగానే కదిలించింది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే చంద్రబాబుపై సెటైర్స్ మోత మోగిపోతోంది. మరి అంతటి ప్రాముఖ్యత ఉన్న అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. చంద్రబాబును ఇబ్బంది పెట్టే చాలా విషయాల్లో పవన్ సరైన సమయంలో స్పందించడం లేదు అన్న మాట వాస్తవం. ఇప్పుడు పవన్ స్పందించకపోతే కూడా చంద్రబాబు తప్పు ఉందేమో అని అనుమానించాల్సిన పరిస్థితి. అలా కాకుండా పవన్ కూడా తన వెర్ణన్ తాను వినిపిస్తేనే బాగుంటుంది. అవసరమైతే అసెంబ్లీ, సచివాలయ భవనాలను పరిశీలించి చంద్రబాబు ప్రభుత్వం తప్పు చేసిందా? లేక ప్రతిపక్షనేత జగన్ కుట్ర ఉందా అనే విషయాంపై తన స్పందన తెలియచేస్తే బాగుంటుందేమో. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కదిలించిన సమస్య గురించి అస్సలు స్పందించకుండా మౌనంగా ఉండడం మాత్రం కచ్చితంగా సమర్థుడైన నాయకుడి లక్షణం అయితే కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close