దావోస్‌కు పిలిచారట..కానీ జగనే వెళ్లలేదట !

ఇప్పుడు అన్ని ప్రభుత్వాల ప్రతినిధులు దావోస్‌లో మకాం వేసి.. మా రాష్ట్రానికి రండి అంటూ పెట్టుబడుల వేట సాగిస్తూంటే.. ఒక్క ఏపీ మాత్రమే నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. ఏపీలో పరిస్థితులు చూసి అసలు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సే.. ఏపీని పట్టించుకోలేదని.. పిలువలేదన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఉడుక్కున్న ప్రభుత్వం… మమ్మల్ని పిలిచారని చెబుతూ.. లేఖ బయట పెట్టింది. ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఇలాంటి విషయాల్లో చురుగ్గా ఉంటుంది. ఈ సారి కూడా అంతే. ప్రపంచ ఆర్థిక వేదిక పంపిన లేఖను పోస్ట్ చేసిది.

గత ఏడాది నవంబర్ 25వ తేదీనే ఈ ఆహ్వాన పత్రిక ఏపీ ప్రభుత్వానికి అందిందని.. అందులో జగన్ సోషియో ఎకనామిక్ డెలవప్‌మెంట్ ని పొగిడారని కూడా చెప్పుకున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా.. మరి ఎందుకు వెళ్లలేదన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఆ అంశం ప్రస్తావించలేదు. వాళ్లు పిలిచాం..మేమే బెట్టు చేశాం.. వెళ్లకూడదనుకున్నాం అన్నట్లుగా ప్రభుత్వ స్పందన ఉంది. గత ఏడాది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా దావోస్ వెళ్లారు. లక్ కోట్లరుపైగా పెట్టుబడులు ఆకర్షించారని ప్రభుత్వం ప్రకటించింది. అంత పెట్టుబడులు సాధిస్తే ఈ సారి ఎందుకు వెళ్లలేదు ? . ఏపీకి పెట్టుబడులు ఆకర్షించాలని లేదా ? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం త్వరలో విశాఖలో ప్రపంచ పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు పెద్ద ఎత్తున ప్రముఖుల్ని ఆహ్వానించాలని అనుకుంటోంది. దావోస్ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి పలు కంపెనీల సీఈవోలు, చైర్మన్లు హాజరు కానున్నారు. ముఖ్యంగా ఇన్వెస్టర్లను తరలి రావాలని కోరుతోంది. ఇలాంటి సమయంలో… ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు సీఎం నేతృత్వంలో ప్రతినిధి బృందం వెళ్లినట్లయితే.. అక్కడే అందరికీ వ్యక్తిగతంగా ఆహ్వానం ఇచ్చినట్లు ఉండేదన్న వాదన పారిశ్రామిక వర్గాల్లో వినిపిస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం.. పిలిచారు కానీ పోలేదని.. చెప్పుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close