జూన్ 4న వెన్నుపోటు దినంగా నిర్వహించాలని పిలుపునిచ్చిన వైసీపీ అధినేత జగన్ ఎక్కడా కనిపించలేదు. వైసీపీ శ్రేణులు అక్కడక్కడ ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. కానీ, ఈ కార్యక్రమంలో ముందుండాల్సిన అధినేత రాష్ట్రంలో ఎక్కడ కనిపించలేదు. దీంతో జగన్ ఏమైపోయారు అని పార్టీ నేతలు, కార్యకర్తలు చర్చించుకున్నారు.
మంగళవారం తెనాలిలో గంజా బ్యాచ్ ను పరామర్శించిన జగన్.. అటు నుంచి అటే బెంగళూరులోని యలహంక ప్యాలెస్ కు వెళ్లిపోయారు. ఇంకోరోజు రాష్ట్రంలోనే ఉండుంటే పార్టీ కార్యక్రమంలో పాల్గొనేవారు. కానీ, ఆయన బెంగళూరు వెళ్ళిపోవడంతో పార్టీ చేపట్టిన నిరసనలో పాల్గొనలేదు. ఇది వైసీపీ క్యాడర్ కు ఏమాత్రం రుచించడం లేదు.
వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది. అయినా ఈ కార్యక్రమంలో జగనే పాల్గొనకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీని తిరిగి పవర్ లోకి తీసుకొచ్చేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడాలి.. జగన్ మాత్రం ప్యాలెస్ లో కూర్చొని హాయిగా రెస్ట్ తీసుకుంటారా అని రుసరుసలాడుతున్నారు.
మరో మూడేళ్లు ఓపిక పట్టండి..కళ్ళు మూసుకుంటే మూడేళ్లు అవుతాయి.. తర్వాత మనదే అధికారం అంటూ క్యాడర్ కు జగన్ తరుచుగా చెబుతున్నారు. కూటమి ఫెయిల్ అయిందని ఇంటింటికి వెళ్లి చెప్పాలని కార్యకర్తలకు చెప్తున్న జగన్, ఆ కార్యకర్తల త్యాగాలపై పదవి చేపట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే అసలైన వెన్నుపోటు అంటూ వైసీపీలో అభిప్రాయం వ్యక్తం అవుతోంది.