బీజేపీ సీమ గొంతు కోస్తున్నా సీఎం జగన్ మౌనమే !

కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది. ప్రాజెక్టుకు బడ్జెట్‌లో ఏకంగా రూ. ఐదు వేల కోట్లకుపైగానే కేటాయించారు. పోలవరంకు రూపాయి కేటాయించకపోగా… నీటికేటాయింపులు లేని అప్పర్ భద్రకు నిధులు కేటాయించడం ఏపీకి ఇబ్బందికరంగా మారింది. అయితే నిధుల విషయంలోనే కాదు.. అసలు ఆ ప్రాజెక్టు నిర్మిస్తే రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఘనత వహించిన ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదు.

కర్నూలు జిల్లాతో పాటు సీమ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించేది తుంగభద్ర, కర్నాటకలో భారీ వర్షాలు కురిస్తేనే నీటి ప్రవహం ఉంటుంది. ఇప్పుడు అసలు నీటిని దిగువకు రాకుండా తుంగభద్ర జలాశయం ఎగువన కర్నాటక అప్పర్‌ భద్ర ప్రాజెక్టు నిర్మాణంకు సిద్ధమయింది. దీంతో ఏపీలోని రాయలసీమకు నీళ్లు రావాలంటే కష్టమవుతుంది.
2014లోనేప్రాజెక్టు నిర్మాణంను కర్ణాటక ప్రారంభించింది. అప్పటి ప్రభుత్వాలు తీవ్ర అభ్యంతరం చెబుతూ వస్తూండటంతో ఆగిపోయింది. కానీ ఇప్పుడు కేంద్రం నేరుగా నిధులుకేటాయించింది.

అప్పర్‌ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్‌ కింద కర్నాటక, ఏపిలోని ఆయుకట్టుతో పాటు కర్నూలు జిల్లాలోని కేసి కాలువ, ఆర్‌డిఎస్‌ కింద ఆయుకట్టు బీడుగా మారిపోతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీటి ప్రవహాం రావడంలో ఆలస్యం చోటుచేసుకుంటుంది. ఇది ఆ ప్రాజెక్టు ఆయుకట్టు రైతులకు ఇబ్బందికరమే. నిజానికి కృష్ణా జల వివాదాల ట్రీబునల్‌ అప్పర్‌ భద్రకు ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదు. అయినా కేంద్రం నిధులు ఇస్తోంది . దీన్ని ఏపీ ప్రభుత్వం ఖండించడం లేదు.

రాష్ట్రంలో ఏం జరుగుతోందో, పక్క రాష్ట్రాలు ఏం చేస్తున్నాయో ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి కనీస స్పృహ కూడా లేకుండా పోతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే సీమ ప్రాజెక్టులు మొత్తం మూలన పడేసి నష్టం చేశారని, ఇప్పుడు ఎగువ భద్ర ప్రాజెక్టుపై ఏం మాట్లాడకుండా మౌనం వహిస్తూండటంతో రాయలసీమ తీవ్రంగా నష్టపోనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close