రెండు నియోజకవర్గాల సమీక్షతోనే అలసిపోయారా !?

సీఎం జగన్ ఏదీ ప్రారంభించినా ఆర్భాటంగానే ఉంటుంది. కానీ తర్వాతే దాని గురించి అసలు పట్టించుకోరు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా అంతే. నియోజకవర్గాల సమీక్షలను యాభై మంది కార్యకర్తలతో ప్రారంభిస్తామని చెప్పి కుప్పం నుంచి ప్రారంభించారు. అటు శివారులో ఉన్న కుప్పం..ఇటు శివారులో ఉన్న రాజాం నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అంతే మళ్లీ నియోజకవర్గాల సమీక్ష ఊసే లేకుండా పోయింది . అధికారంలోకి వచ్చాక జగన్‌తో కలిసే చాన్స్ రాలేదని ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు. ఇక ద్వితీయ శ్రేణి కార్యక్తల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ చాన్స్ ఇస్తున్నట్లుగా ఊరించి…. లైట్ తీసుకుంటున్నారు.

నియోజకవర్గాల నుంచి యాబై మంది కార్యకర్తలు వస్తున్నారు కానీ.. వారు టీ, కాఫీలు తాగి జగన్ చెప్పేది విని వెళ్లడం తప్ప.. అభిప్రాయాలు చెప్పే అవకాశం రావడం లేదు. ప్రజలు నిలదీస్తున్న వైనం గురించి చెబితే ఎక్కడ హైలెట్ అవుతుందోనని వారిని నియంత్రిస్తున్నారు. మనం 175 సీట్లు గెలుచుకుందామని జగన్ చెబుతున్నారు కానీ.. సమీక్షలకు వస్తున్న వారి మైండ్‌లో మాత్రం రోడ్లు.. పథకాలు మాత్రమే ఉంటున్నాయి . దాదాపుగా అందర్నీ స్థానిక ప్రజాప్రతినిధులనే ఎంపిక చేస్తున్నారు. ఈ కారణంగా వారు తమపై ప్రజలు చేస్తున్న ఒత్తిడిని సీఎం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. కానీ ప్రయోజనం లేకపోతోంది.

ఇప్పుడు రెండు నియోజకవర్గాలతోనే ఈ సమీక్షలు ఆగిపోవడం వైసీపీ నేతల్లోనూ నిరాశ వ్యక్తమవుతోంది. ఇంకా ఏడాదిన్నరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రతీ రోజూ సమీక్ష చేసినా.. ఆరు నెలలు పడుతుంది. వారానికి మూడు నియోజకవర్గాలు చొప్పున సమీక్ష చేస్తే ఏడాది పైనే పడుతుంది. కానీ ఎన్నికల వేడి ప్రారంభమైన తర్వాత ఇక సమీక్షల గురించి అవకాశమే ఉండదు. అందుకే.. ఇదంతా ఆర్భాటమైన ప్రకటనలేనని.. కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితి లేదని ఉసూరుమంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close