హైదరాబాద్‌లో “ఏపీ సీఎం క్యాంపాఫీస్‌”కు ముస్తాబులు ! ఎందుకోసం ?

హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంపాఫీస్‌గా లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌కు పేరుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆ గెస్ట్ హౌస్‌ను ఏపీకి కేటాయిచారు. చంద్రబాబునాయుడు మొదట్లో అక్కడ్నుంచే కొంతకాలం కార్యకలాపాలు నిర్వహించారు. తర్వాత అమరావతి వెళ్లిపోవడంతో ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రమే వాడేవారు. తర్వాత పట్టించుకోలేదు. జగన్ సీఎం అయిన తర్వాత దాన్ని అసలు పట్టించుకోలేదు.ఇటీవల వర్షాల సమయంలో ఆ గెస్ట్ హౌస్ నిండా నీళ్లు వచ్చాయని మీడియాలో ప్రచారం జరిగింది.

జగన్ సెక్రటేరియట్ భవనాలను తెలంగాణ సర్కార్‌కు అప్పగించారు కానీ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్‌ను అధికారులు ముస్తాబు చేస్తున్నారు. నిర్వహణ లేక పాడైపోయిన వాటిని తొలగించి రిపేర్లు చేస్తున్నారు. ఉపయోగించుకోవడానికి అనుకూలంగా మారుస్తున్నారు. దాన్ని ఇతర అవసరాలకు వాడే అవకాశం లేదు. సీఎం జగన్ మాత్రమే ఉపయోగించగలరు. దీంతో జగన్ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా అక్కడే ఉండాలనుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

జగన్‌కు హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఇల్లుంది. ఆయన అక్కడికే వెళ్తారు. కానీ లేక్ వ్యూ ఎందుకు అన్న సందేహం వినిపిస్తోంది. సీఎం జగన్ హైదరాబాద్ వచ్చేది కూడా తక్కువేనని గుర్తు చేస్తున్నారు. అయితే జగన్ సీబీఐ కేసుల్లో రోజువారీ విచారణ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు చెప్పాల్సి ఉంది. రిజర్వ్‌లో ఉంది . ఆ తీర్పు సానుకూలంగా వచ్చే అవకాశం లేదని.. ముఖ్యమంత్రి అన్న కారణంగా విచారణ నుంచి వ్యక్తిగత మినహాయింపు దొరకదని భావిస్తున్నారు. ఈకారణంగానే లేక్ వ్యూను రెడీ చేయిస్తున్నారని అంటున్నారు. మొత్తంగా ఏపీ ప్రభుత్వంలో కూడా జరగబోయే పరిణామాలపై ఓ క్లారిటీ ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close