గురూజీ డుమ్మా… బండ్ల‌న్న మిస్‌!

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకి సంబంధించిన ఫంక్ష‌న్ అన‌గానే అంద‌రి క‌ళ్లూ బండ్ల గ‌ణేష్‌పైపు తిరుగుతాయి. ఎందుకంటే ప‌వ‌న్ ఫంక్ష‌న్‌లో, ప‌వ‌న్ ముందు, బండ్ల ఇచ్చే ఎలివేష‌న్లు మామూలుగా ఉండ‌వు. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి అవి కావ‌ల్సినంత కిక్ ఇస్తాయి. ఇది వ‌ర‌కు చాలా ఫంక్ష‌న్లలో జ‌రిగింది ఇదే. `బ్రో` ప్రీ రిలీజ్ వేడుక‌లోనూ బండ్ల వ‌స్తాడ‌ని, త‌న స్పీచ్‌తో అద‌ర‌గొడ‌తాడ‌ని అంతా భావించారు. కానీ ఈ ఫంక్ష‌న్‌కి బండ్ల రాలేదు. నిజానికి అత‌నికి పిలుపే అంద‌లేదు. పిలిస్తే వ‌చ్చేవాడే. గ‌తంలో భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కీ తను వెళ్ల‌లేదు. త్రివిక్ర‌మ్ త‌న‌ని రానివ్వ‌డం లేద‌ని, పిలిస్తే వ‌చ్చేవాడిన‌ని బండ్ల ఫోన్ కాల్ ఒక‌టి లీక్ అయి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఈసారైనా బండ్ల‌కు ఛాన్స్ వ‌స్తుంద‌నుకొంటే… ఇప్పుడూ దూరం పెట్టేశారు. దాంతో బండ్ల రాలేదు. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆ మ‌జా మిస్ అయ్యారు.

బండ్ల రాలేదంటే ఓ రీజ‌న్ ఉంది. మ‌రి గురూజీ త్రివిక్ర‌మ్ ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు. ఈ ఫంక్ష‌న్‌లో ఆయ‌నా మిస్ అయ్యారు. ఈ సినిమాకి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అన్నీ ఆయ‌నే. సంభాష‌ణ‌లు రాసి, స్క్రీన్ ప్లే స‌మ‌కూర్చినందుకు ఏకంగా రూ.15 కోట్ల పారితోషికం అందుకొన్నారు. పైగా వ‌ప‌న్ త‌న‌కు అత్యంత ప్రియ‌మైన మిత్రుడు. ఆయ‌న రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. త్రివిక్రమ్ వ‌చ్చి ఉంటే, ఆయ‌న స్పీచ్ హైలెట్ అయ్యేది. ఈ సినిమాపై మ‌రింత బ‌జ్ ఏర్ప‌డేది. కానీ… గురూజీ రాలేదు. అది మాత్రం బ్రో ఫంక్ష‌న్‌కి లోటే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

య‌శ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌

'కేజీఎఫ్`తో య‌శ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. 'కేజీఎఫ్‌' త‌ర‌వాత య‌శ్ ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడా? అని దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేప‌థ్యంలో గీతు మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి...

శింగనమల రివ్యూ : కాంగ్రెస్ రేసులో ఉన్న ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం !

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేసులో ఉందని చెప్పుకుంటున్న ఒకే ఒక్క నియోజకవర్గం శింగనమల. మాజీ మంత్రి శైలజానాథ్ గతంలో...

ఫోటోలు – టీడీపీ మేనిఫెస్టోలో వైసీపీకి కనిపిస్తున్న లోపాలు !

వైసీపీ మేనిఫెస్టోపై ప్రజల్లో జరుగుతున్న చర్చ జీరో. ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడుకోవడం లేదు. కానీ టీడీపీ మేనిపెస్టోపై టీడీపీ నేతలు ప్రత్యేకమైన ప్రణాళికలతో ప్రచార కార్యక్రమం పెట్టుకున్నారు. అదే...

టార్గెట్ పవన్ కళ్యాణ్ …పొన్నూరులో వైసీపీ అభ్యర్థి దౌర్జన్యం

ఏపీలో టీడీపీ సారధ్యంలోని కూటమిదే అధికారమని సర్వేలన్నీ స్పష్టం చేస్తుండటంతో వైసీపీ నేతల్లో ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబును అడ్డుకుంటే అది వైసీపీకి డ్యామేజ్ చేస్తుందని భావించి పవన్ ను వరుసగా టార్గెట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close