నిజమే .. వైసీపీ వచ్చిన మూడేళ్లలో 30 వేలమంది మహిళల మిస్సింగ్!

వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ముప్పై వేల మంది మహిళలు మిస్ అయిన మాట నిజమేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలోనే ఈ అంశాన్ని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ లో 2019లో 2186 మంది బాలికలు మిస్సయ్యారు. అంటే 18ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న వారిని బాలికల కేటగరిలో చేరుస్తారు. 6252 మంది మహిళలు మిస్సయ్యారు. అలాగే 2020లో 2374 మంది బాలికలు, 7057 మంది మహిళలు ఆచూకీ లేకుండా పోయారు. 2021లో ఈ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 3358 మంది బాలికలు .. 8969 మంది మహిళలు కనిపించకండా పోయారు. మొత్తంగా వీరి సంఖ్య 30196 మంది. వీరిలో కొంత మంది ఆచూకీ తర్వతా తెలిసిందని కేంద్ర హోంశాఖ చెబుతోంది.

దేశం మొత్తం మీద మూడున్నర లక్షల మందికిపైగా చిన్నారులు, మహిళలు మిస్సింగ్ అయినట్లుగా కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. మహిళల మిస్సింగ్ అంశం రాజకీయంగా ఏపీలో దుమారం రేపడంతో అసలైన డేటా ఏమిటన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. ప్రభుత్వం కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లలోనే ముఫ్పై వేల మంది మిస్సయ్యారని తేలడంతో ఈ అంశం మరోసారి రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉంది.

మహిళల మిస్సింగ్‌కు… హ్యూమన్ ట్రాఫికింగ్‌కు సంబంధం లేదని వైసీపీ వర్గాలు వాదిస్తున్నాయి. ఈ మిస్సింగ్‌లకు వాలంటీర్లకు సంబంధం లేదని.. వాలంటీర్లు లేని చోట్ల కూడా పెద్ద ఎత్తున మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయని చెబుతున్నారు. అయితే మహానగరాలు హైదరాబాద్, ముంబై, బెంగళూరు ఉన్న రాష్ట్రాల్లో అత్యధిక మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. పెద్ద సిటీలు లేని రాష్ట్రాల్లో ఏపీలోనే అత్యధికంగా మహిళలు కనిపించకుండా పోతున్నారు. దీన్నే పవన్ ప్రశ్నిస్తున్నారు. ఈ మిస్టరీ ఏమిటో బయటకు వస్తుందా ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close