ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి ఒప్పుకొంది. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా కౌశిక్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఇటీవ‌ల కాన్సెప్ట్ పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి ‘కిష్కింద పురి’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. అదే ఖ‌రారు కాబోతోంది కూడా. ఇప్పుడు ఈ సినిమాలో క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది తెలిసిపోయింది.

ఇందులో అనుప‌మ‌ని హీరోయిన్‌గా ఎంచుకొన్నార‌ని స‌మాచారం. బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో అనుప‌మ‌కు ఇది రెండో చిత్రం. ఇది వ‌ర‌కు ‘రాక్ష‌సుడు’లో క‌లిసి న‌టించారు. అయితే అందులో వీరిద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ చూసే అవ‌కాశం ద‌క్క‌లేదు. `కిష్కింద‌పురి`లో మాత్రం ఆ ఛాన్స్ వుంది. ఇదో హార‌ర్‌, ఫాంట‌సీ నేప‌థ్యంలో సాగే క‌థ‌. కోతుల‌కు, ఈ క‌థ‌కు ఓ చిన్న‌పాటి లింక్ ఉంది. అందుకే ‘కిష్కింద‌’ అనే ప‌దం టైటిల్ లో ఉండేలా చూసుకొంది చిత్ర‌బృందం. హార‌ర్ కాన్సెప్టుల‌కు కాలం చెల్ల‌లేద‌ని ఇటీవ‌ల వ‌చ్చిన సినిమాలు నిరూపించాయి. ఆ త‌ర‌హాలో చేస్తున్న మ‌రో ప్ర‌య‌త్నం ఇది. త్వ‌ర‌లోనే క‌థానాయిక పేరు అధికారికంగా ప్ర‌క‌టిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎయిర్‌లైన్స్‌ సహా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ… ప్రధాని సంచలన నిర్ణయం

కొన్నేళ్లుగా ఆర్థిక , రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ను తిరిగి గాడిన పెట్టేందుకు ఇటీవల ఎన్నికైన కొత్త ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను అమలు చేయాలని...

వైసీపీ కుట్రలకు వీరనారిలా ఎదురు నిలిచిన మహిళ..!!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసింది. వ్యవస్థలను తమ చెప్పు,చేతుల్లో ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చిందన్న విమర్శలు మూటగట్టుకుంది. దాంతో ఎన్నికలను కూడా సరైన విధంగా నిర్వహించేందుకు వైసీపీ సహకరిస్తుందా..? అనే...

రంగంలోకి కేజ్రీవాల్… బీజేపీ ఆశలపై నీళ్లు చల్లుతారా..?

మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇటీవల మధ్యంతర బెయిల్ రావడంతో ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంతమేర ఉంటుందనేది చర్చనీయాంశం అవుతోంది. గతంలో ఢిల్లీలోని లోక్ సభ...

టాలీవుడ్ కి తొలి ప్రమాద హెచ్చరిక

తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని, దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close