కిరణ్ చేరికతో ఏపీ బీజేపీలో మరో గ్రూప్ !

ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయన బీజేపీలో ఎందుకు చేరారన్న విషయం పక్కన పెడితే ఆయన చేరిక కార్యక్రమంలో ఏపీ బీజేపీ నేతలెవరూ పాల్గొనలేదు. చివరికి ఏపీ పీసీసీ చీఫ్ సోము వీర్రాజు కూడా దూరంగానే ఉండిపోయారు. ఇక ఏపీ బీజేపీ తరపున దిగ్గజాలుగా వ్యవహరిస్తున్న జీవీఎల్ నరసింహారావు,, పురందేశ్వరి సహా ఎవరూ కనిపించలేదు. కిరణ్ కుమార్ రెడ్డితో పాటు జై సమైక్యాంధ్ర పార్టీలో పని చేసిన విష్ణువర్ధన్ రెడ్డి మాత్రమే ఆయనతో పాటు ఢిల్లీలో ఉన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి చేరిక బీజేపీలో ఇతర నేతలకు ఇష్టం లేదని ఈ పరిణామాలతో స్పష్టమయింది. అయితే సోము వీర్రాజు వర్గం మాత్రం ఆయన… కిరణ్‌కు ఫోన్ చేశారని.. కలసి పని చేస్తామని ప్రకటించారు. అసలే ఏపీ బీజేపీలో ఇప్పటికే మూడు గ్రుపులున్నాయి. ప్రో వైసీపీ.. ప్రో టీడీపీ… బీజేపీ గ్రూపులతో పాటు ఇప్పుడు కొత్తగా కిరణ్ గ్రూప్ కూడా తయారవుతోందన్న వాదన వినిపిస్తోంది. సోము వీర్రాజుకు సన్నిహితంగా వ్యవహరించిన వారు ఇటీవల ఆయన వ్యవహారశైలి కారణంగా దూరమవుతున్నారు. వారంతా కిరణ్ ఆధ్వర్యంలో గ్రూపుగా మారుతారని అంటున్నారు.

కిరణ్‌కు బీజేపీ హైకమాండ్ కూడా అంత ప్రాధాన్యం ఇవ్వలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రహ్లాద్ జోషితో కండువా కప్పించారు. సాయంత్రం జేపీ నడ్డాతో కిరణ్ సమావేశం అయ్యారు. ఆయనకు ఏ పదవి ఇస్తారన్నది స్పష్టత లేదు. ఏ పదవి ఇచ్చినా ఏపీ బీజేపీ నేతల్లో అసంతృప్తి ఖాయం. తమకు రావాల్సిన పదవి ఆయనకు ఇచ్చారని అనుకుంటారు. అయితే అసలు కిరణ్‌తో బీజేపీ ఎలాంటి ప్రయోజనం ఆశిస్తుందనేది ఇప్పుడు ఎవరికీ అంతుబట్టని విషయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close