శుక్రవారమైనా చంద్రులిద్దరూ మాట్లాడుకుంటారా?

హైదరాబాద్: రాజ్‌భవన్‌లో ఈనెల 10వ తేదీన ఇచ్చే ఇఫ్తార్ విందుకు గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ ఆహ్వానించారు. ఓటుకు నోటు, సెక్షన్ 8 వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల పాలకుల మధ్య వాతావరణం వేడివేడిగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఈ విందుకు హాజరవుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ ఇటీవల రాజ్‌భవన్‌లో ఇచ్చిన విందుకు చంద్రబాబు హాజరైనప్పటికీ, కేసీఆర్ మాత్రం జ్వరంసాకుతో ఎగ్గొట్టారు. సీఎమ్ జ్వరంతో బాధపడుతున్నట్లు ఉదయంనుంచే మీడియాకు లీకులు వదిలారు. చంద్రబాబుకు ఎదురుపడటం ఇష్టంలేకే ఆయన విందుకు గైర్హాజరయ్యారన్న వాదన ఆ రోజు బాగా వినిపించింది. మరి వచ్చే శుక్రవారం రాజ్‌భవన్‌లోనే జరగబోయే విందుకు ఇరువురు చంద్రులూ హాజరవుతారా, హాజరైతే మాట్లాడుకుంటారా అనేది తెలియటంలేదు. గత సంవత్సరం గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు చంద్రబాబు హాజరుకాగా, కేసీఆర్ హాజరుకాలేదు. నాటి విందుకు జగన్, జానారెడ్డి, నాయని తదితరులు హాజరయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close