అభ్యర్థుల ఎంపికపై జనసేనాని దృష్టి పెట్టారా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేపట్టారు. తాను రోడ్డెక్కితే ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు చూపిస్తున్నారు. అంత వరకూ బాగానే ఉంది..కానీ పార్టీ పరంగా ఆయన తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా అన్నది సందేహంగా మారింది. వైసీపీ, టీడీపీ అధినేతలు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల విషయంపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు . ఎప్పటికప్పుడు ఇంచార్జుల్ని ప్రకటించడం.. వారు జోరుగా ప్రజల్లోకి వెళ్లడం వంటివి చేస్తున్నారు. అయితే జనసేన వైపు నుంచి అలాంటి కార్యాచరణ కనిపించడం లేదు.

పొత్తుల గురించి పక్కన పెడితే పవన్ కల్యాణ్ .. అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ కార్యకలాపాలు జరిగేలా చూసుకోవాల్సి ఉంది. ఇందు కోసం ఇంచార్జుల్ని ప్రకటించి వారు జోరుగా ప్రజల్లోకి వెళ్లే సన్నాహాలు చేయాలి. కానీ జనసేనాధినేత వైపు నుంచి అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. బలమైన నేతలు ఉన్న అతి కొద్ది చోట్ల మాత్రమే అభ్యర్థులు కనిపిస్తున్నారు. భీమిలిలో పంచకర్ల, విజయవాడలో పోతిన మహేష్ , తిరుపతిలో కిరణ్ రాయల్ వంటివారు కనిపిస్తున్నారు., వారు అభ్యర్థులు అవునో కాదో తెలియదు కానీ.. పార్టీ కోసం గట్టిగానే పని చేస్తున్నారు.

అలాంటి నేతల్ని ఇతర నియోజకవర్గాల్లో పెంచుకోవడంలో… ఇంచార్జులుగా నియమించుకోవడంలో పవన్ కల్యాణ్ విఫలమయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టిక్కెట్ల ఖరారును వీలైనంతగా పూర్తి చేయాల్సి ఉంటుంది. టిక్కెట్లు దక్కక ఇతర పార్టీల నుంచి వలస వచ్చే వారికి చాన్స్ ఇస్తే… రాజోలు ఎమ్మెల్యే రాపాకలాగానే మారుతారు. అందుకే… ఈ సారి పవన్ జనసైనికులకే చాన్సిస్తే మంచిదన్న సలహాలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close