మరి టీడీపీకి సస్పెండ్ చేస్తుందా ?

తమ పార్టీ తరపున నలుగురు క్రాస ఓటింగ్ చేశారని చేశారని గుర్తించామని వారిని సస్పెండ్ చేసింది వైసీపీ హైకమాండ్. ఇప్పుడు వైసీపీ నేతలు మరి టీడీపీ ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేయరా అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు పలికారు. విప్ జారీ చేసినా వైసీపీకి ఓటేశారు. సీక్రెట్ ఓటింగ్ కాబట్టి వారు నిజంగా ఎవరికి ఓటు వేశారో తెలియదు. అధికారికంగా తెలియదు కానీ అనధికారికంగా వారు వైసీపీ అభ్యర్థులకే ఓట్లేశార.

తాము ధైర్యంగా తమ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశామని.. మీరు కూడా సస్పెండ్ చేయాలని టీడీపీ నేతల్ని సవాల్ చేస్తున్నారు వైసీపీ నేతలు. నిజానికి ఈ నలుగుర్ని సరైన సమయంలో సస్పెండ్ చేస్తామన్న వైసీపీ హైకమాండ్.. వీరిపై చర్యలు తీసుకోపతే మిగతా వారు ధిక్కరిస్తారన్న భయంతో వెంటనే చర్యలు తీసుకుంది. అధికార పార్టీకి అది అవసరం. టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయకపోయినా… చేసినా ఆ పార్టీకి వచ్చేదేమీ లేదు. అయితే వారిపై అనర్హతా వేటు వేయాలని గతంలోనే ఫిర్యాదు చేశారు. ఆ అనర్హతా వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉపఎన్నికల్లో తేల్చుకుందామని అంటున్నారు. దీనపై మాత్రం వైసీపీ నేతలు మాట్లాడటం లేదు.

సస్పెండ్ చేస్తే వారు హాయిగా వెళ్లి వైసీపీలో చేరిపోతారు. అలాంటి చాన్స్ ఇవ్వకుండా.. అనర్హతా వేటు వేసే పరిస్థితుల కోసం టీడీపీ ఎదురు చూస్తోంది. అయితే ఇలా ఎప్పుడైనా టీడీపీ విప్ ను ధిక్కరించాల్సిన పరిస్థితుల్లో ఆ నలుగురు ఎమ్మెల్యేలు తప్పించుకుటున్నారు.త ప్రభుత్వానికి మద్దతుగా ఉండటం లేదు. దాంతో బయటపడిపోతున్నారు. సస్పెండ్ చేయడం పెద్ద విషయం కాదని.. దమ్ముంటే వైసీపీ, టీడీపీ, జనసేనకు చెంది… ధిక్కరించిన 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని.. ఉపఎన్నికలకు వెళదామని సవాల్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close