మరి టీడీపీకి సస్పెండ్ చేస్తుందా ?

తమ పార్టీ తరపున నలుగురు క్రాస ఓటింగ్ చేశారని చేశారని గుర్తించామని వారిని సస్పెండ్ చేసింది వైసీపీ హైకమాండ్. ఇప్పుడు వైసీపీ నేతలు మరి టీడీపీ ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేయరా అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు పలికారు. విప్ జారీ చేసినా వైసీపీకి ఓటేశారు. సీక్రెట్ ఓటింగ్ కాబట్టి వారు నిజంగా ఎవరికి ఓటు వేశారో తెలియదు. అధికారికంగా తెలియదు కానీ అనధికారికంగా వారు వైసీపీ అభ్యర్థులకే ఓట్లేశార.

తాము ధైర్యంగా తమ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశామని.. మీరు కూడా సస్పెండ్ చేయాలని టీడీపీ నేతల్ని సవాల్ చేస్తున్నారు వైసీపీ నేతలు. నిజానికి ఈ నలుగుర్ని సరైన సమయంలో సస్పెండ్ చేస్తామన్న వైసీపీ హైకమాండ్.. వీరిపై చర్యలు తీసుకోపతే మిగతా వారు ధిక్కరిస్తారన్న భయంతో వెంటనే చర్యలు తీసుకుంది. అధికార పార్టీకి అది అవసరం. టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయకపోయినా… చేసినా ఆ పార్టీకి వచ్చేదేమీ లేదు. అయితే వారిపై అనర్హతా వేటు వేయాలని గతంలోనే ఫిర్యాదు చేశారు. ఆ అనర్హతా వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉపఎన్నికల్లో తేల్చుకుందామని అంటున్నారు. దీనపై మాత్రం వైసీపీ నేతలు మాట్లాడటం లేదు.

సస్పెండ్ చేస్తే వారు హాయిగా వెళ్లి వైసీపీలో చేరిపోతారు. అలాంటి చాన్స్ ఇవ్వకుండా.. అనర్హతా వేటు వేసే పరిస్థితుల కోసం టీడీపీ ఎదురు చూస్తోంది. అయితే ఇలా ఎప్పుడైనా టీడీపీ విప్ ను ధిక్కరించాల్సిన పరిస్థితుల్లో ఆ నలుగురు ఎమ్మెల్యేలు తప్పించుకుటున్నారు.త ప్రభుత్వానికి మద్దతుగా ఉండటం లేదు. దాంతో బయటపడిపోతున్నారు. సస్పెండ్ చేయడం పెద్ద విషయం కాదని.. దమ్ముంటే వైసీపీ, టీడీపీ, జనసేనకు చెంది… ధిక్కరించిన 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని.. ఉపఎన్నికలకు వెళదామని సవాల్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహానాడు : టీడీపీ 6 హామీలతో భవిష్యత్‌కు గ్యారంటీ !

మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంక్షే్మ రంగంలో ఆరు హామీలు ప్రకటించింది. భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో మినీ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించారు. నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు టీడీపీ...

ఎన్టీఆర్‌ను వైసీపీ స్మరించుకుంది.. చంద్రబాబును తిట్టడానికైనా సరే!

ఎన్టీఆర్ అందరి మనిషి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సహజంగానేకొంత మందికి దూరంఅవుతారు. అలా దూరమైన వారు కూడా ప్రత్యేక సందర్భాల్లో దగ్గర చేసుకోక తప్పదు. ఎన్టీఆర్‌ను అలా దగ్గర చేసుకోవాల్సిన ప...

బాలయ్య కోసం కొత్త ప్ర‌పంచం సృష్టిస్తాడ‌ట‌

అ, క‌ల్కి, జాంబిరెడ్డి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్పుడు హను-మాన్ రూపొందిస్తున్నాడు. తేజా స‌జ్జా క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. ఈలోగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేసే...

అందరికీ బెంచ్ మార్క్ బిల్డింగ్‌లు – ఏపీ జనానికి మాత్రం బటన్లు !

తెలంగాణ ప్రభుత్వం ఓ పెద్ద సెక్రటేరియట్ కట్టుకుంది. కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు కేంద్రం పార్లమెంట్ నిర్మించింది.. అంత కంటే ఎక్కువ కథలు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ రెండు నిర్మాణాలూ అవసరం లేదని..దుబారా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close