ఎన్నికలను వైసీపీ బహిష్కరిస్తుందా..!?

పంచాయతీ ఎన్నికలకు తొలి దశ నోటిఫికేషన్ విడుదలయింది. విపక్షాలన్నీ ఎన్నికలకు సిద్ధమంటున్నాయి. కానీ వైసీపీ మాత్రం.. ఎన్నికలు వద్దే వద్దని అంటోంది. ప్రభుత్వం కూడా అదే చెబుతోంది. ప్రభుత్వం అసలు ఎన్నికలు జరుగుతాయనే ఆలోచనే పెట్టుకోకుండా… ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ప్రభావితం చేసి.. ఎన్నికలకు దూరంగా పెట్టాలని నిర్ణయించింది. ఇప్పుడు పరిస్థితి ఎటు తిరిగి ఎటు వెళ్తుందో చెప్పడం కష్టమవుతోంది. చివరికి సుప్రీంకోర్టులోనే ఏదో ఒకటి తేలాల్సి ఉంది. ఇరవై ఐదో తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించాల్సి ఉంది. అధికారులు స్వీకరిస్తారో లేదో క్లారిటీ లేదు. సుప్రీంకోర్టులో ఆ రోజున పిటిషన్ విచారణ జరగాల్సి ఉంది. అప్పటి వరకూ సహకరించాల్సిన అధికారులు సహకరించే పరిస్థితి లేదు.

అయితే విపక్ష పార్టీలన్నీ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఏర్పాట్లు చేసుకున్నాయి. స్థానిక నేతలు… తమ తమ అభ్యర్థుల్ని ఖరారు చేసుకున్నాయి. నామినేషన్ పేపర్లు కూడా రెడీ చేసుకుంటున్నారు. నిజానికి పంచాయతీ ఎన్నికలు… పార్టీల ప్రకారం జరగవు. పార్టీ గుర్తుల ఆధారంగా జరగవు. ఆయా పార్టీల మద్దతుదారులన్నట్లుగానే జరుగుతాయి. అందుకే… నేతలు స్థానికంగా తమ పార్టీ మద్దతుదారులను బరిలో నిలబెట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ తరహా ప్రయత్నాలను వైసీపీ నేతలు కూడా చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి కాబట్టి.. సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు రాదన్న చర్చ బలంగా ఉంది. ఇలాంటి సమయంలో వైసీపీ ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంది. కానీ హైకమాండ్ నుంచి ఎలాంటి సూచనలు అందడం లేదు.

దీంతో కొంత మంది స్థానిక నేతలు.. చొరవ తీసుకుని సర్పంచ్ అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఎటూ తేలకపోతే… వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారా లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికలకు పూర్తి వ్యతిరేకం కాబట్టి… ఎన్నికలు బహిష్కరిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అలా జరిగితే.. స్వీయ శిక్ష విధించుకుంటున్నట్లు అవుతుందన్న ఆందోళన వైసీపీ వర్గాల్లో ఉంది. మిగతా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ లాగే.. దీనిపైనా వైసీపీ నేతలకు క్లారిటీ లేకుండా పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close