పురందేశ్వరిని చూసి వైసీపీ ఇంత భయపడుతోందేంటి !?

పురందేశ్వరి చేస్తున్న ఆరోపణలు, చేస్తున్న పోరాటం వైసీపీ నాయకుల్ని వణికిపోయేలా చేస్తోంది. ఎంతగా అంటే.. రోజు అంతా ఆమెను టార్గెట్ చేస్తున్నారు. విజయసాయిరెడ్డితో పాటు రోజా, కొడాలి నాని ఇలా అందర్నీ రంగంలోకి దించుతున్నారు. ఆమెను సైలెంట్ చేసేందుకు ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారు. విజయసాయిరెడ్డికి గుండె దడ అసలు తగ్గుతున్నట్లుగా లేదు. విజయసాయిరెడ్డి, జగన్ రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని నేరుగా సీజేఐకి లేఖ రాయడమే కాదు.. నేడో రోపే సీబీఐ కోర్టులోనూ పిటిషన్ వేసేందుకు సిద్ధమవడంతో.. విజయసాయిరెడ్డి ఆమెపై ఇష్టారీతిన వాగుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్టు చేసుకోవచ్చు కదా అని ఇష్టం వచ్చినట్లుగా అమర్యాదకరమైన భాషతో ఇష్టం వచ్చినట్లుగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు.

విజయసాయిరెడ్డి ట్వీట్లు చూస్తూంటే పురందేశ్వరి మీద ఆయనకు భయంతో కూడిన కోపం వచ్చిందని ఎవరికైనా అర్థమవుతతుంది. ఓ రాజకీయ పార్టీ అధ్యక్షురాలిగా .. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వంపై ఆమె విమర్శలు చేయడం సహజం. దానికి చేతనైతే అధికార పార్టీగా ఆధారాలతో సమాధానం ఇవ్వాలి. అంతే కానీ.. వ్యక్తిగత, కుటుంబ విషయాలతో దాడి చేయడం అంటే.. మానసికంగా ఇబ్బంది పెట్టి ఆమెను సైలెంట్ చేయాలని ప్రయత్నం చేయడమే. ఇతర నేతల్ని రంగంలోకి దించారు.

రోజా.. కొడాలి నాని వంటి నోరు అదుపు ఉండని నేతలు పురందేశ్వరిపై విరుచుకుపడుతున్నారు. పురందేశ్వరి బయట పెడుతున్న అంశాలు.. లేవనెత్తుతున్న విషయాలను చూసి.. అవి ముందుకు వెళ్తే తాము ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందోనని వైసీపీ నేతలకు కంగారెక్కు అయిపోయి విమర్శలు చేస్తున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. వారిపై పోరాటం పురందేశ్వరి ఆపేది ఉండదని.. బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close