అప్పట్లో అంతా కరువే – ఇప్పుడసలు కరువే లేదు : జగన్ రెడ్డి

జగన్ రెడ్డి ప్రజల గురించి ఏమనుకుంటన్నారో కానీ ప్రజలంతా కరువుతో అల్లాడిపోూంటే అసలు కరువే లేదని నిర్మోహమాటంగా బహిరంగసభల్లో చెబుతున్నారు. తాము చెప్పేది నమ్ముతారు.. తాము రాసేదే చదువుతారు.. అదే నిజమన్న భ్రమలో ప్రజలు ఉంటారని జగన్ రెడ్డి గట్టి నమ్మకంతో ఉన్నారు. కళ్ల ముందు కనిపిస్తున్న కరువును కూడా . కాదని చెప్పేంత తెగింపు ఆయనకు వచ్చింది. రైతు భరోసా నిధులను బటన్ నొక్కడానికి ఏర్పాటు చేసిన బహిరంగసభలో బటన్ నొక్కిన తర్వాత చేసిన ప్రసంగం విన్నవారికి .. ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లుగా.. అచ్చమైన హలోకేషన్ లో జగన్ రెడ్డి బతికేస్తున్నారన్న అబిప్రాయం ఏర్పడితే అందులో తప్పేమీ లేదు.

చంద్రబాబు హయాంలో రైతులందరూ కష్టాలుపడిపోయారని..తాను సీఎం పీఠం ఎక్కగానే అందరూ ఒక్క సారిగా సిరి సంపదలు, సుఖ సంతోషాల్లోకి వచ్చేశారన్నట్లుగా ఆయన చెబుతున్నారు. జగన్ రెడ్డి ఏడాదికి ఒకే సారి పన్నెండున్నర వేలు ఇస్తానని హామీ ఇచ్చి.. పీఠంలోకి వచ్చి మూడు విడతలుగా ఏడున్నర వేలు ఇస్తున్నాడు. కేంద్రం ఇచ్చి పీఎం కిసాన్ నిధులు తాను ఇస్తున్నట్లుగా చెప్పుకుంటున్నాడు. నిజానికి రెడ్డి హామీ ఇచ్చే నాటికి పీఎం కిసాన్ పథకం లేదు. రైతు భరోసా పేరుతో ఉన్న పథకాలన్నింటినీ ఆపేశాడు. రైతుల్ని నట్టేట ముంచారు. చివరికి దాన్యం అమ్ముకోవాలన్నా పక్క రాష్ట్రానికి పోవాల్సిన పరిస్థితి. వ్యవసాయానికి ఇబ్బంది లేకండా కరెంట్ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. అసలు పంటలే వేయనప్పుడు కరెంట్ తో సంబందం ఏమిటన్న సెటైర్లు వస్తున్నాయి. రైతులు పంట పండిస్తే.. ప్రభుత్వం కొంటే దాన్ని కూడా రైతులకు ఉచితంగా ఇచ్చిన సాయం అన్నట్లుగా చెప్పుకోవడం జగన్ రెడ్డికే చెల్లింది.

ప్రతి సభను రాజకీయ సేభగా మార్చుకోవడం ఆయన చేసిన పని కాబట్టి.. ఈ సభలోనూ కళ్లార్పకుండా అబద్దాలు చెప్పేశారు. చంద్రబాబుపై కుట్రుల చేసి పద్దతి పాడు లేకుండా కేసులు పెట్టేసి.. చూశారా చంద్రబాబుపై ఎన్ని కేసులు ఉన్నాయో.. అవన్నీ అవినీతి వల్లేనని నమ్మబలికారు జగన్ రెడ్డి తీరు చూస్తే.. వినేవాడు చెప్పవాడు లోకువని.. ప్రజల్ని ఓ మాదిరిగా చూడని లీడరని.. అందరికీ అనిపిస్తుంది. ప్రజల్నితక్కువగా చూస్తున్న ఒక్క జగన్ రెడ్డికి తప్ప.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నయి. దేశంలో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కూడా కాంగ్రెస్ కే అడ్వాంటేజ్ లభించింది. జాతీయ మీడియాలు...

ఏపీ పోలీసులతో సాగర్ గేట్లు ఎత్తేయించి జగన్ రెడ్డి సాధించిందేంటి ?

తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్టు చేయాలంటే వారు అందుబాటులో ఉన్నా సరే. అర్థరాత్రి వాళ్లు నిద్రపోయిన తర్వాత గేట్లు దూకి, తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేస్తారు. అది కోర్టులో నిలబడని కేసు.....

ప్రాసెస్‌లో క్వాష్ పిటిషన్‌పై తీర్పు : సుప్రీంకోర్టు ధర్మాసనం

చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై తీర్పు ప్రాసెస్ లో ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఫైబర్ నెట్ స్కాంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై...

తెలంగాణ ఓటరు నిరాసక్తత

తెలంగాణ ఓటరు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పెద్ద పెద్ద క్యూలైన్లు ఎక్కడా కనిపించడం లేదు. మధ్యాహ్నం ఒంటింగంట వరకూ పోలింగ్ పర్సంటేజీ కేవలం 37 శాతం వరకే ఉంది. 2018లో ఇది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close