గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్

ప్రపంచ ప్రసిద్ది చెందిన పెప్సీ కూల్ డ్రింక్స్ సంస్థకి సీ.ఈ.ఓ.గా భారతదేశానికి చెందిన ఇంద్రానూయి, ఆ తరువాత మరో ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థకు సత్య నాదెళ్ళ సీ.ఈ.ఓ.గా నియమించబడటంతో అంతర్జాతీయ సంస్థలపై భారతీయుల ఆధిపత్యం మొదలయింది. ఇంకా అనేక ఇతర అంతర్జాతీయ సంస్థలలో భారతీయులే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో తాజాగా చెన్నై కి చెందిన సుందర్ పిచాయ్ పేరు కూడా చేరిందిప్పుడు. ఇంటర్నెట్ కి పర్యాయపదంగా మారిన గూగుల్ సంస్థకి ఆయన సీ.ఈ.ఓ.గా నియమితులయ్యారు. గూగుల్ వ్యవస్థాపకులయిన ల్యారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ తమ గ్రూప్ ఆఫ్ కంపెనీలలో నుండి గూగుల్ ని వేరు చేసి దానికి సుందర్ పిచాయ్ ని సీ.ఈ.ఓ.గా నియమించారు.

సుందర్ పిచాయ్ (43) స్వస్థలం తమిళనాడు రాజధాని చెన్నై. తరువాత ఐఐటి ఖరగ్ పూర్ లో ఆయన తన మెటలర్జీలో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసారు. ఆ తరువాత స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎం.యస్. వార్టన్ స్కూల్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ పెన్సల్వేనియాలో ఎం.బి.ఏ. పూర్తి చేసారు. ఆ తరువాత ఆయన అమెరికాలోని మెక్ కిన్సి అండ్ కంపెనీలో ఇంజనీరుగా కొంత కాలం పనిచేసారు. 2004లో గూగుల్ కంపనీలో ప్రవేశించి తన ప్రతిభను చాటుకొంటూ అంచలంచెలుగా ఎదుగుతూ నేడు ఆ సంస్థకే సీ.ఈ.ఓ.గా నియమితులయ్యారు.

ఇంతకు ముందు ఆయన గూగుల్ సంస్థలో క్రోమ్ మరియు ఆండ్రాయిడ్ విభాగాలకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా సేవలందించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన గూగుల్ క్రోమ్, గూగుల్ డ్రైవ్, క్రోమ్ ఆపరేటింగ్ సిస్టం, ఆండ్రాయిడ్ ఆవిష్కరణలో ఆయనదే కీలక పాత్ర. అంతే కాదు గూగుల్ అందిస్తున్న గూగుల్ మ్యాప్స్, జీ మెయిల్ వంటి వాటికి ఎప్పటికప్పుడు అధనపు హంగులను జోడించడంలోను ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారు. మున్ముందు మరిన్ని విన్నూత్నమయిన ఆవిష్కరణల కోసం ఆయన నిరనతరం శ్రమిస్తున్నారు. ఆయన భార్య పేరు అంజలి. ఆ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close