తెలంగాణ బీజేపీ నేతలకు వై ప్లస్ సెక్యూరిటీ ఆఫర్లు !

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు ఎంపీ ధర్మపురి అరవింద్ లకు కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నాయి. ఈటల రాజేందర్ హత్యకు హుజూరాబాద్ బీఆర్ఎస్ ఇంచార్జ్ కౌశిక్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఇటీవల ఈటల జమున ఆరోపించారు. రూ. ఇరవై కోట్లు ఖర్చు పెడతానన్నారని ఆమె చేసిన ఆరోపణలు రాజకీయవర్గాల్లో సంచలనం రేకెత్తించాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తయింది. పోలీసు అధికారులతో భద్రతా సమీక్ష చేశారు. అయితే కేంద్రానికి కూడా ఈ విషయం మొరపెట్టుకోవడంతో వై ప్లస్ భధర్త కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇక ధర్మపురి అరవింద్ కూడా తనపై కుట్రలు జరుగుతున్నాయని కేంద్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. ఇటీవల ధర్మపురి అర్వింద్ ఇంటిపై ఎమ్మెల్సీ కవిత అనుచరులు దాడి చేశారు. ఆయన నియోజవవర్గంలో ఎక్కడ పర్యటించినా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. బీజేపీ ముఖ్య నేతలిద్దరూ కేంద్ర భద్రత పెంచడం రాజకీయంగానూ చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణలో హత్యా రాజకీయాలకు ప్రణాళికలు వేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న సమయంలో కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. నాయకుల ఆరోపణలు, విజ్ఞప్తులతోనే కేంద్రం భద్రత కల్పించదని.. వారికి ఇంటలిజెన్స్ సమాచారం వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటల మంటలు పెరుగుతున్నాయి. నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఇంటలిజెన్స్ కు ఏమైనా సమాచారం వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడిపై దాడి జరిగినా అధికారంలో ఉన్న పార్టీకే చెడ్డ పేరు వస్తుందని.. బీఆర్ఎస్ నేతలు దాడులు చేయడానికి లేదా కుట్రలు చేయడాన్ని హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంటందని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close