వైసీపీ అభ్యర్థికి సన్మానం చేస్తానన్న వంశీ..! అదే కేసు…!

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పోలింగ్ సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడ వల్లభనేని వంశీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే.. ఆయనకు..నేరుగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతల నుంచి బెదిరింపులు వచ్చాయని… దాంతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత… బిందాస్ అనుకున్న వంశీ… ఎన్నికలను సీరియస్‌గా తీసుకుని… అంతే జోరుగా…పోలింగ్ ప్రక్రియను కూడా ముగించారు. అయితే.. ఇప్పుడు ఆయన ఓ వివాదంలో ఇరుక్కున్నారు. వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు … విజయవాడ పోలీస్ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావును కలిసి .. వల్లభనేని వంశీపై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు సారాంశం ఏమిటంటే… వంశీ తనకు సన్మానం చేస్తానన్నాడని… తన ఇంటికి కూడా వచ్చాడనేది ఆ ఫిర్యాదు సారాంశం.

ఎన్నికల ప్రచారంలో యార్లగడ్డ వెంకట్రావు అందరిలాగే.. తన ప్రత్యర్థి అయిన వల్లభనేని వంశీతో పాటు.. టీడీపీ అధినేత చంద్రబాబుపైనా… విమర్శలు చేశారు. అయితే… పద్దతిగా చెప్పుకోవడానికి అవి విమర్శలు కానీ.. మామూలుగా అయితే .. తిట్లు అనుకోవాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న వంశీ.. ఎన్నికలు అయిపోయిన తర్వాత యార్లగడ్డ వెంకట్రావుకు ఫోన్ చేసి.. ఎన్నికల ప్రచారంలో… తనను, చంద్రబాబును తిట్టావు కాబట్టి.. నీకు సన్మానం చేయాల్సి ఉందని అన్నారట. తనకు ఏ సన్మానాలు అవసరం లేదు.. తాను కలవనని చెప్పి.. వెంకట్రావు ఫోన్ పెట్టేశారట. అయితే… వల్లభనేని వంశీ వదిలి పెట్టలేదు. ఓ సారి సమయం చూసుకుని యార్లగడ్డ వెంకట్రావు ఇంటికి వెళ్లారు. కానీ ఆయన లేరు. దాంతో.. తాను వచ్చి వెళ్లానని చెప్పమని… వాచ్‌మెన్‌కు చెప్పి వెళ్లారట. దాంతో వెంకట్రావు.. వెంటనే .. పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వంశీ తన ఇంటికి వచ్చిన సీసీ టీవీ ఫుటేజీని సమర్పించారు.

వంశీ తన ఇంటికి వచ్చి .. సన్మానం చేస్తానంటున్నారని.. తానే వంశీ ఇంటికి వెళ్తానని.. తనకు గన్ మెన్ల రక్షణ కల్పించాలని యార్లగడ్డ వెంకట్రావు సీపీ ద్వారకా తిరుమలరావుకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు ముందే వైసీపీలో చేరిన… మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు కూడా సీపీని కలిసి.. వంశీ తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. నిజంగానే.. వల్లభనేని వంశీ సన్మానం చేయాలనుకున్నారా లేక.. సన్మానం పేరుతో దాడి చేయాలనుకున్నారా.. అనే దానిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close