యార్లగడ్డ కూడా రివర్స్..! ఇంగ్లీష్ మీడియంకే సపోర్ట్..!

ఏపీలో తెలుగు మీడియం ఎత్తేసి..ఇంగ్లిష్ మీడియం మాత్రమే.. ఉంచాలనుకున్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని… అధికార భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సమర్థించారు. అల్పాదాయ, మధ్య ఆదాయ వర్గాల పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం పెట్టాలని జగన్‌ పాదయాత్రలో చెప్పారు, ప్రజాభీష్టానికి అనుగుణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందని.. చెప్పుకొచ్చారు. అయితే.. ఏపీలో అన్ని పాఠశాలల్లో ఒకటో తరగతి నుండి పదో తరగతి తెలుగును తప్పనిసరి చేస్తూ జీవో ఉందని ఏపీలో ప్రాథమిక విద్యలో తెలుగు వినిపిస్తుంది, కనిపిస్తుందని ప్రభుత్వాన్ని సమర్థించారు.

ఇదే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్… చంద్రబాబు హయాంలో.. పూర్తి స్థాయిలో కాకుండా.. కేవలం అర్బన్ ప్రాంతాల్లో అదీ కూడా…ఇంగ్లిష్ మీడియంలో చదవాలనుకునే ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశ పెడితే.. చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చంద్రబాబు తెలుగును చంపేస్తున్నాడని… వారానికో సారి ప్రెస్ మీట్ పెట్టి విమర్శించేవారు. అయితే.. అప్పుడు ఆయనకు… మధ్య, అల్పాదాయ వర్గాల పిల్లలు గుర్తుకు రాలేదు. ఎందుకంటే.. ఆయనకు చంద్రబాబు ఎలాంటి పదవి ఇవ్వలేదని… ఇప్పుడు.. జగన్మోహన్ రెడ్డి పిలిచి మరీ.. రెండు పదవులు.. ఒకటి తెలుగు.. మరొకటి హిందీ పదవులు ఇచ్చేసరికి… తెలుగు ఏమైపోయినా.. పర్వాలేదన్నట్లుగా.. సమర్థిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

అచ్చంగా.. మీడియాలో దశాబ్దాలుగా పని చేసి.. చివరికి.. మీడియాకు సంకెళ్లు వేసే జీవోకు మద్దతు పలికిన … ప్రసిద్ధ జర్నలిస్టుల తీరు మాదిరిగానే… యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ స్పందన ఉందంటున్నారు. వారికీ పదవులు వచ్చాయి కాబట్టి… తమ పాత విధానానికి రివర్స్ అయ్యారు. ఇప్పుడు యార్లగడ్డకు ఒకటికి రెండు పదవులు వచ్చాయి కాబట్టి.. రివర్స్ అయ్యారంటున్నారు. అందరిదీ… రాజకీయ ఆరాటమే కానీ.. తాము ఇప్పటి వరకూ ప్రవచించిన సిద్ధాంతాలకు కట్టుబడే పెద్దలు కనిపించడం లేదనే విమర్శలు ఇలాంటి వారిని చూసినప్పుడు సహజంగానే వస్తూంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close