క్యాడర్ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో చూపించిన యాత్ర 2

యాత్ర సినిమా సమయంలో ఏపీలో సినిమాను ప్రజలు డబ్బులు పెట్టి చూడలేదు కానీ.. పార్టీ నేతలు తమ డబ్బులు పెట్టి ఆడించారు. ఉచితంగా ప్రజలకు చూపించారు. అప్పుడు ఉన్న మూడ్ ను బట్టి ప్రజలు కూడా ఉచితంగా వచ్చే సినిమానే కదా అని చూశారు. ఇప్పుడు యాత్ర 2 సినిమా విడుదలయింది. కానీ ద్వితీయ శ్రేణి క్యాడర్ పూర్తిగా ఎవాయిడ్ చేసింది. పార్టీపై అభిమానంతో లేదా.. నాయకుడిపై అభిమానంతో ఆ సినిమా చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. ఆ విషయం కలెక్షన్లలో స్పష్టమవుతోంది.

సినిమాకు స్వచ్చందంగా ప్రజలు ఎవరూ రారు. కానీ పార్టీ కార్యకర్తలు అయినా రావాలి కదా ! తొలి రోజు.. రెండు కోట్ల రూపాయలు నెట్ వచ్చింది. అందులోనూ సగం గుంటూరు నుంచి వచ్చింది. గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేస్తున్న విడదల రజనీ ఖాతాలో ఆ ఖర్చు ఎక్కువగా పడింది. మిగిలిన చోట్ల ఎవరూ పట్టించుకోలేదు. కనీసం కొత్త సమన్వయకర్తలు కూడా ఆ బాధ్యతలు తీసుకోలేదు. తాము కూడా చూసేందుకు ఆసక్తి చూపించలేదు. ఎంతగా అంటే చివరికి సొంత జిల్లా కడప క్యాడర్ కూడా లైట్ తీసుకున్నారు

క్యాడర్ ను జగన్ రెడ్డి దివాలా తీయించారు. ఎంతగా అంటే.. చివరికి కడపలో వారికి కూడా ఇటీవల క్యాడర్ రేంజ్ ను బట్టి డబ్బులు పంచాల్సి వచ్చింది. సొంత పాలనలో వారంత అంతగా ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయారంటే.. మరి మిగిలిన చోట్ల పరిస్థితి ఎలా ఉండాలి ?. అంత కంటే ఘోరంగా ఉందని తేలిపోతోంది. ఓ వంద రూపాయలు ఖర్చు పెట్టి.. వైసీపీ కార్యకర్తలు యాత్ర 2 సినిమాను చూసేందుకు సిద్ధంగా లేరు. క్యాడర్ కొట్టే దెబ్బ ఎలా ఉండబోతోందో..యాత్ర కలెక్షన్లు.. వైసీపీకి చూపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close