పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించి వారం రోజులు పూర్తయిందో లేదో వైసీపీ వైపు నుంచి హాహాకారాలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ సభలకు పెద్ద ఎత్తున జనం వస్తూండటమే కాదు.. జగన్ ఏపీకి చేసిన అన్యాయం.. కాపులపై చేసిన కుట్రలన్నింటినీ బయట పెడుతూండటంతో .. వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి హాహాకారాలు పెడుతున్నారు. చివరికి పవన్ సారీ చెప్పాలంటూ పోసానిని కూడా రంగంలోకి దిపండం.. ఆ పార్టీ ఎంతగా .. వారాహి యాత్రకు ప్రభావితం అవుతుందో అర్థం అయిపోతోంది.
పవన్ కల్యాణ్ తన పర్యటనలో ఎక్కడా పొత్తుల గురించి మాట్లాడటం లేదు. ఇంకా చెప్పాలంటే తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు. అయితే వీరంతా తెరపైకి వచ్చి.. చంద్రబాబును సీఎంను చేయడానికి ప్రయత్నిస్తున్నారని కొత్త వాదన తీసుకు వస్తున్నారు. ముద్రగడ ను ముందు పెట్టి కాపు లో చీలిక తేవడానికి చేయగలిగినదంతా చేస్తున్నారు. చివరికి సజ్జల కూడా అదే చెబుతున్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే పవన్ మాట్లాడుతున్నారని అంటున్నారు.
గతంలో పవన్ తో పాటు ఆయన కుటుంబాన్ని పోసాని లాంటి వారితో బూతులు తిట్టించి కుల రాజకీయాలు చేసి అధికారం పొందిన వైసీపీ.. ఇప్పుడు అదే రీతిన పవన్ ను దెబ్బకొట్టాలని చూస్తోంది. పవన్ సామాజికవర్గ మంత్రులతో చేయించే ఎదురుదాడి కాకుండా.. కొత్తగా అసహ్యంగా మాట్లాడే పోసానిని రంగంలోకి దించి.. ముద్రగడ కు మద్దతుగా.. పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడించడం వారి భయానికి నిదర్శనాలని.. జనసైనికులు అంటన్నారు.
వారాహి అందర్నీ తొక్కుకుంటూ వెళ్తుందని.. ఇలాంటి హాహాకారాలు ఇంకా చాలా చాలా వింటారని జనసైనికులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.