వారాహి యాత్ర : సజ్జల నుంచి పోసాని వరకూ హాహాకారాలే !

పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించి వారం రోజులు పూర్తయిందో లేదో వైసీపీ వైపు నుంచి హాహాకారాలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ సభలకు పెద్ద ఎత్తున జనం వస్తూండటమే కాదు.. జగన్ ఏపీకి చేసిన అన్యాయం.. కాపులపై చేసిన కుట్రలన్నింటినీ బయట పెడుతూండటంతో .. వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి హాహాకారాలు పెడుతున్నారు. చివరికి పవన్ సారీ చెప్పాలంటూ పోసానిని కూడా రంగంలోకి దిపండం.. ఆ పార్టీ ఎంతగా .. వారాహి యాత్రకు ప్రభావితం అవుతుందో అర్థం అయిపోతోంది.

పవన్ కల్యాణ్ తన పర్యటనలో ఎక్కడా పొత్తుల గురించి మాట్లాడటం లేదు. ఇంకా చెప్పాలంటే తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు. అయితే వీరంతా తెరపైకి వచ్చి.. చంద్రబాబును సీఎంను చేయడానికి ప్రయత్నిస్తున్నారని కొత్త వాదన తీసుకు వస్తున్నారు. ముద్రగడ ను ముందు పెట్టి కాపు లో చీలిక తేవడానికి చేయగలిగినదంతా చేస్తున్నారు. చివరికి సజ్జల కూడా అదే చెబుతున్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే పవన్ మాట్లాడుతున్నారని అంటున్నారు.

గతంలో పవన్ తో పాటు ఆయన కుటుంబాన్ని పోసాని లాంటి వారితో బూతులు తిట్టించి కుల రాజకీయాలు చేసి అధికారం పొందిన వైసీపీ.. ఇప్పుడు అదే రీతిన పవన్ ను దెబ్బకొట్టాలని చూస్తోంది. పవన్ సామాజికవర్గ మంత్రులతో చేయించే ఎదురుదాడి కాకుండా.. కొత్తగా అసహ్యంగా మాట్లాడే పోసానిని రంగంలోకి దించి.. ముద్రగడ కు మద్దతుగా.. పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడించడం వారి భయానికి నిదర్శనాలని.. జనసైనికులు అంటన్నారు.

వారాహి అందర్నీ తొక్కుకుంటూ వెళ్తుందని.. ఇలాంటి హాహాకారాలు ఇంకా చాలా చాలా వింటారని జనసైనికులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close