లేఖ బయటకు ఎలా వచ్చిందన్న దానిపైనే విచారణ కావాలట..!

స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ .. కేంద్రానికి రాసిన లేఖ విషయలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు టోన్ మార్చారు. నిన్న సాయంత్రం నుంచి అదో ఫేక్ లేఖ అని.. టీడీపీ సృష్టి అని ఆరోపిస్తున్న వారు ఇవాళ.. అసలు ఆ లేఖ బయటకు ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్‌ఈసీ రమేష్ కుమార్ కేంద్రానికి రాసిన లేఖ తర్వాత అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి. సీఆర్పీఎఫ్ భద్రతను.. ఎస్‌ఈసీకి..కార్యాలయానికి కల్పించారు. కేంద్ర హోంశాఖ కూడా.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ లేఖ రాశారంటూ.. వైసీపీ నేతలు మండిపడ్డారు. అయితే.. లేఖ నిజం కావడంతో.. బయటకు ఎలా వచ్చిందో విచారణ చేయాలంటూ..కొత్త డిమాండ్లు అందుకున్నారు.

కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేల బృందం…డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ను కలిసింది. ఎస్‌ఈసీ రమేష్‌కుమార్ లేఖ ఎలా బయటకు వచ్చిందో దర్యాప్తు చేయాలని కోరారు. నిజానికి లేఖ నిజమా.. కాదా అన్నదే ముఖ్యం కానీ.. అది బయటకు ఎలా వచ్చిందో అన్నది పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఆ లేఖ బయటకు రావడమే వైసీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. అందుకే… ఎస్‌ఈసీ రమేష్ కుమార్ పై ఒత్తిడి తెచ్చేందుకు ఆ లేఖ ఎలా బయటకు వచ్చిందో దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. నిజానికిఈ లేఖ విషయంలో.. రమేష్ కుమార్ గుంభనంగా వ్యవహరిస్తున్నారు.

లేఖ రాసినట్లుగా కానీ.. రాయనట్లుగా కానీ ఆయన స్పందించడం లేదు. మీడియాకు ఎలా వచ్చిందో తనకు తెలియదన్నట్లుగా ఆయన ఉండిపోయారు. ఆ లేఖను తాను రాయలేదని కొంత మంది మీడియా ప్రతినిధులుక ఆయన చెప్పినట్లుగా.. వైసీపీకి మద్దతుగా ఉండే కొన్ని చానళ్లు నిన్నంతా ప్రచారం చేశాయి. కానీ .. ఆయన అలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన కేంద్ర బలగాల భద్రత కల్పించడం… వైసీపీ నేతలు.. ఆ లేఖ వాస్తవికత గురించి కాకుండా.. ఎలా బయటకు వచ్చిందో దర్యాప్తు చేయాలని డీజీపీని కోరడం… వంటివి పరిశీలిస్తే.. ఆ లేఖ పై.. ఇక రమేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం ఏర్పరుచుకోవచ్చంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close