తెలంగాణలో వైసీపీ అంటే ఇక షర్మిల పార్టీనే..!

తెలంగాణ వైసీపీ నేతలందరూ షర్మిల పార్టీలో చేరుతూంటే.. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు మాత్రం రూటు మార్చారు. ఆయన బీజేపీ బాట పట్టారు. తెలంగాణలో వైసీపీ ఇక ఉండదని.. ఉండకూడదని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని… షర్మిల పార్టీ ప్రకటన సమయంలో ప్రెస్ మీట్ పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించేశారు. దాంతో ప్రస్తుతం షర్మిల పార్టీ తరపున హడావుడి చేస్తున్న పిట్ట రాంరెడ్డి, కొండా రాఘవరెడ్డి లాంటి తెలంగాణ వైసీపీ నేతలందరూ పోలోమంటూ పోయి షర్మిల పార్టీలో చేరిపోయారు. ఆ పార్టీ ప్రారంభం కాక ముందే హడావుడి ప్రారంభించారు. అందరి చూపు.. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డిపై పడింది. ఆయనను కూడా షర్మిల పార్టీలో చేరాలని… రాయబారాలు నడిచాయి.

వైఎస్ విజయలక్ష్మి కూడా ఫోన్ చేసి అడిగారు. షర్మిల తరపున ప్రతినిధులు వెళ్లి సంప్రదింపులు కూడా జరిపారు. కానీ గట్టు శ్రీకాంత్ రెడ్డి మాత్రం.. తాను వైసీపీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు కానీ… షర్మిల పార్టీలో మాత్రం చేరడంలేదు. భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో గట్టు శ్రీకాంత్ రెడ్డికి మంచి పట్టు ఉంది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి.. మూడో స్థానం సాధించారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయం ప్రకారం పోటీ చేయలేదు. ఆ సందర్భంలో… ఫలితాలు వచ్చిన తర్వాత.. టీఆర్ఎస్‌కు సహకరించేందుకే పోటీ చేయలేదని.. వస్తున్న విమర్శలకు జగన్ .. హుజూర్ నగర్ ఫలితాన్నే ఉదాహరణగా చెప్పారు.

తాము హుజూర్ నగర్‌లో పోటీ చేసి ఉంటే.. ఉత్తమ్ కుమార్ గెలిచేవారా అంటూ లాజిక్ లాగారు. అంత పట్టు ఉన్న గట్టు శ్రీకాంత్ రెడ్డి బీజేపీకే జైకొట్టారు. జాతీయ పార్టీలో చేరి.. హుజూర్ నగర్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ జాతీయ పార్టీ బీజేపీనే.. ఇప్పటికే బీజేపీ పెద్దలతో చర్చలు కూడా జరిపారు. గట్టు రాజీనామాతో తెలంగాణలో వైసీపీ అంతర్థానం అయినట్లే. ఇక షర్మిల పార్టీనే వైసీపీ బ్రాంచ్‌గా అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close