పల్నాడుకు వెళ్లడమే వాళ్ల తప్పంటున్న వైసీపీ..!

దాడులు.. దౌర్జన్యాలే స్థానిక ఎన్నికల్లో అస్త్రాలుగా మారిపోయాయి. పెద్ద నేతలపై హత్యాయత్నాలు కూడా జరుగుతున్నాయి. పల్నాడు వెళ్లిన బొండా ఉమ, బుద్దా వెంకన్నలపై జరిగిన హత్యాయత్నం దృశ్యాలు సంచలనం సృష్టిస్తున్నాయి. పల్నాడులో అత్యంత భయంకర వాతావరణం ఉందన్న … పోలీసులపైనా వైసీపీ నేతలు దాడులు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతిని ఖండించాల్సిన వైసీపీ నేతలు.. అసలు… బొండా ఉమ, బుద్దా వెంకన్ పల్నాడు ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తున్నారు. వారు పల్నాడు వెళ్లినందుకే దాడి జరిగిందన్నట్లుగా బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేతలు కూడా ప్రకటనలు చేస్తున్నారు.

పోలీసులను చంద్రబాబు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని గత ఐదేళ్లు చంద్రబాబు ఏం చేశారో తెలుసంటూ.. హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. భయపెట్టి అరాచకం చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోమని బొత్స చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు.. పోలీసులపై దాడులకు దిగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులను పోలీసులు పట్టుకోలేదు. వారు యధేచ్చగా పోలీసులపైనా దాడులకు దిగారు. వైసీపీ నేతలు.. దాడులకు తెగబడుతున్నా.. కొంత మంది పోలీసులు వారికి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ పర్యటన వివరాలను పోలీసులే వైసీపీ నేతలకు ఎప్పటికప్పుడు చెబుతూ.. ఎక్కడికెళ్లినా దాడులకు పులికొల్పారని బొండా ఉమ ఆరోపిస్తున్నారు.

మాచర్లలో పట్ట పగలే రాళ్లు, పెద్ద పెద్ద కర్రలతో దుండగులు దాడిచేయడం అమానుషమని… ఏపీలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా అని ఇతర పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. బిహార్‌ కంటే దారుణమైన పరిస్థితులు ఏపీలో ఉన్నాయన్న అభిప్రాయం.. ఇతర పార్టీల నేతల్లో వస్తోంది. ఈ ఘటనపై పోలీసులు పెద్దగా స్పందించిన దాఖలాలు కూడా ఈసీ కూడా.. స్పందించలేదు. వ్యవస్థలన్నీ.. నిద్రాణంగా ఉండిపోతున్నాయన్న అభిప్రాయం.. సామాన్యుల్లో వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close