కన్నీటితో భువనేశ్వరి కాళ్లు కడుగుతామన్న వైసీపీ ఎమ్మెల్యే

నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారాన్ని ముగించాలని వైసీపీ నేతలు బతిమాలుతున్నారు. వల్లభనేని వంశీ మీడియా చానళ్లను పిలిచి ప్రతి ఒక్క చానల్‌కు విడివిడిగా ఇంటర్యూలు ఇచ్చి క్షమాపణలు చెప్పారు. అయితే ఈ అంశాన్ని టీడీపీ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. అనాల్సినదంతా అని క్షమాపణ చెబితే సరిపోతుందా అని ఆ పార్టీ నేతలు అంతర్గత సంభాషణల్లో అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అడుగడుగునా గౌవరసభలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు రోజుకొకరు చొప్పున తప్పు చేశామని తెర ముంందుకు వస్తున్నారు.

తాజాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరరెడ్డి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఆమె భావించి బాదపడి ఉంటే.. కన్నీటితో కాళ్లు కడుగుతామని ప్రకటించి కలకలం రేపారు. వైసీపీ ఎమ్మెల్యేలందరూ ఆ పని చేస్తారన్నారు. వల్లభనేని వంశీ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ సహచర సభ్యునిగా బాధ్యత తీసుకుంటామని .. దయచేసి ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని కోరుతున్నారు.

వైఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ అయినా.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అయినా తమందరికీ.. ఒకే గౌరవమని రాచమల్లు చెప్పుకొచ్చారు. ఎవరు ఏ మహిళను కించపరిచినా అది తప్పేనంటూ వ్యాఖ్యానించారు. ఆనాడు సత్యహరిశ్చంద్రుడు ఇచ్చిన మాటకోసం భార్యను చక్రవర్తి ఇంటికి పనికి పంపితే..ఈనాడు చంద్రబాబు నాలుగు ఓట్ల కోసం, తన భార్య శీలాన్ని బజారుకీడుస్తున్నాడని రాచమల్లు అంటున్నారు. టీడీపీ గౌరవసభలు నిర్వహిస్తే వైసీపీ ఎమ్మెల్యేలకు బాగా ఇబ్బందికరంగా ఉన్నట్లుగా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close