వైసీపీ ఎమ్మెల్యే “అవినీతిలో నిజాయితీ” చూస్తే మైండ్ బ్లాంకే !

మేమేమి నీతి మంతులం కాదు.. అవినీతి చేయడం లేదని చెప్పడంలేదు.. కానీ తక్కువే చేస్తున్నాం… అని ఘనంగా ప్రకటించుకున్నారు.. ఓ వైసీపీ ఎమ్మెల్యే. తక్కువే అంటే ఎంత అనే డౌట్ ఇతరులకు వస్తుంది కాబట్టి.. దాన్ని కూడా ఆయనే క్లారిఫై చేశారు. గత టీడీపీ హయాంలో జరిగిన దానికంటే తక్కువే అవినీతి చేస్తున్నారట. ఈ అవినీతి లో నిజాయితీ చూపిస్తున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కావలి నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తున్నారు. ఆయన మాటలు వినిపి.. వైసీపీ నేతలకు కూడా షాక్ తగిలినట్లయింది. అవినీతి చేస్తున్నామని ఇంత బహిరంగంగా చెబుతున్నారు.. ఆ అవినీతిలో తమకూ భాగముందని అంటారేమోనని వారి భయం.

రాష్ట్రం మొత్తం వైసీపీ నేతలు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు.. నీరు, మట్టి , ఇసుకతో పాటు ప్రజల్నీ దోచుకుంటున్నారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. కావలిలోనూ ఎక్కువగానే ఉన్నాయి. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీన్ని సమర్థించుకోవడానికి రామిరెడ్డి ఇలా తెర ముందుకు వచ్చారు. ఎస్ ..మేము అవినీతి చేస్తున్నామని నిజాయితీగా ఒప్పుకున్నారు. అయితే.. తమది తక్కువే అని చెప్పడానికి గత ప్రభుత్వంలో జరిగిన దాని కన్నా తక్కువే అని చెప్పుకుంటున్నారు. సీఎంజగన్ తాను గత ప్రభుత్వం కన్నా తక్కువే అప్పులు చేశానని చెప్పుకుంటూ ఉంటారు.. ఇప్పుడు ఎమ్మెల్యేలు గత ప్రభుత్వం కంటే తక్కువే అవినీతి చేస్తున్నామని సర్టిఫై చేసుకుంటున్నారు.

ఇటీవల అంబటి రాంబాబు కూడా అదే చెప్పారు . తానేమీ సుద్దపూసను కానని.. రాజకీయాలన్నాక కొన్ని అవసరాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఏ సందర్భంలో అంటే.. ఓ తల్లిదండ్రులకు బిడ్డ చనిపోతే వచ్చిన పరిహారంలో రెండున్నరలక్షల వాటా కావాలని అడిగిన విషయం బయటకు వచ్చినందుకు. వైసీపీ నేతలు మెల్లగా అవినీతి కూడా తప్పే కాదని..రాజకీయాల్లో అవసరాలు ఉంటాయని వాదించడానికి సద్ధపడుతున్నట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close