ఆ ముసలాయన బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేదు: జగన్

యాభై ఏళ్లు దాటిన జగన్మనోహన్ రెడ్డి చంద్రబాబును ముసలాయన అని సంబోధించడం ప్రారంభించారు. చేదోడు పథకం కింద గట్టిగా నియోజకవర్గానికి రెండు వేల మందికి కూడా లబ్ది చేకూర్చని పథకానికి .. రూ.కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చుకుని .. భారీగా ఖర్చు చేసి బహింగసభ ఏర్పాటు చేసుకుని మరీ వినుకొండలో బటన్ నొక్కిన సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా రాజకీయ ప్రసంగమే చేశారు. చంద్రబాబును పదే పదే ముసలాయన అంటూ సంబోధించారు. గతంలో ముసలాయనప్రభుత్వం ఉండేదని.. ఆ ప్రభుత్వంో అంతా దాచుకో.. దోచుకో..తినుకో అన్నట్లుగా ఉండేవారన్నారు. ఆ ముసలాయన ప్రభుత్వంలో చేసిన దాని కన్నా తక్కువే అప్పులు చేశామని చెప్పుకొచ్చారు.

ఆ ముసలాయన ఇప్పుడు తాము ఇస్తున్నట్లుగా బటన్ నొక్కి పథకాలకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అప్పుడూ ఇప్పుడు ఉన్నది ఒకే రాష్ట్రం.. ఒకేబ డ్జెట్ అన్నారు. ఆ ముసలాయన ప్రభుత్వంలో తెచ్చిన అప్పులన్నీ ఏం చేశారని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో తోడేళ్లన్నీ ఒకటవుతున్నాయని.. తాను తాను మాత్రం సింగిల్ గా సింహంలాగా వస్తానని చెప్పుకొచ్చారు మీ బిడ్డకు భయం లేదు…తాను దేవుడ్ని ప్రజల్ని నమ్ముకున్నానని సెంటిమెంట్ కురిపించే ప్రయత్నంచేశారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన ..,ప్రసంగాలు ఎప్పుడూ ఒకలేగా సాగుతున్నాయి. దీంతో ఎవరికీ ఆసక్తి లేకుండా పోయింది.

అయితే కొత్త చంద్రబాబును వయసు పేరుతో కించ పర్చే ప్రయత్నం చేయడం మాత్రం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. జగన్ మోహన్ రెడ్డి నిత్య యవ్వనుడిగా ఉంటారా అన్న సహజంగానే ఎవరికైనా వస్తుంది. చంద్రబాబు వయసును చూపించి.. తానే భవిష్యత్ అని ప్రజలకు చెప్పే ప్రయత్నం జగన్ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. అయితే కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వని ముఖ్యమంత్రి అనే పేరు పడిపోతుందన్న వాదన వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close