వైసీపీ చివరి ప్రయత్నాలు : ఫేక్ ఎడిట్లు, మార్ఫింగ్‌లు, దొంగ నోట్లు, దాడులు

ఎన్నికల్లో గెలవాలంటే ఎవరైనా ప్రజలతో ఓట్లేయించుకోవడానికి చివరి క్షణం వరకూ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ వైసీపీ డీఎన్‌ఎలో ప్రజల్ని పరిగణనలోకి తీసుకోవడం అనేదే ఉండదు. గెలవాలంటే తమకు వేరే మార్గాలు ఉన్నాయని … ఆ మార్గాల్లోనే ప్రయత్నిస్తామని నిరూపిస్తూ ఉంటారు. తాజాగా అదే చేస్తున్నారు.

విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి విశాఖ రాజధానిపై చేసిన కామెంట్స్ అంటూ ఓ వీడియోను సజ్డల సుపుత్రుడు భార్గవ్ రెడ్డి తన ఖాతాలో పోస్టు చేశారు. దానికి భరత్ చెప్పుతో కొట్టినట్లుగా అసలు వీడియో పెట్టి సమాధానం ఇచ్చారు. అయితే ఇలాంటివి మామూలే… తుడుచుకుని వెళ్లిపోతామన్న మానసిక స్థితికి వారు ఎప్పుడో చేరిపోయారు కాబట్టి తగ్గడం లేదు. పత్రికల పేరుతో ఫేక్ ఎడిట్లు … బీబీసీని, పీటీఐని సైతం వాడేసి ఫోటో షాప్ మార్ఫింగ్‌లు చేయడం కామన్ అయిపోయింది. బీబీసీ పేరుతో .. పురందేశ్వరి కామెంట్స్ అంటూ ఓ పోస్టర్ హైలెట్ చేశారు. బీబీసీ ఛీ అని తిట్టేసింది. పీటీఐ పేరుతో ఓ తప్పుడు సర్వేను వదిలాశారు. ఇంత చేతకాని సన్నాసులేంటని .. పీటీఐ పెద్ద ట్వీట్ పెట్టింది. ఇలాంటివి చూసుకుంటే… వైసీపీ సోషల్ మీడియా టోటల్ ఫేక్ గా బతికేస్తోంది. ఇంకా ఘోరం ఏమిటంటే విజయవాడ తూర్పు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ పై తప్పుడు ప్రచారం చేయడం. క్లియర్ గా ఫేక్ అని తెలుస్తున్నా.. నమ్మే గొర్రెలు నమ్ముతాయి కదా అని.. వైసీపీ నేతల ఉద్దేశం.

ఆఫ్ లైన్ లోనూ ఇదే పరిస్థితి. వైసీపీ నేతలు దొంగ నోట్లు పంచుతున్నారని పుకార్లు గట్టిగా వ్యాపిస్తున్నాయి. ఒకటి రెండు చోట్ల దొంగ నోట్లు బయటడపడటం కలకలం రేపింది. ఇక వారు పంచే లిక్కర్ నకిలీది. అత్యంత హానికరమైన మద్యాన్ని లోకల్ గా తయారు చేసి పంచేస్తున్నారు. ఎవరి ప్రాణాలు పోతే మాకేంటి అన్నట్లుగా వారి వ్యవహారశైలి ఉంది. ఇక… దాడులతో భయపెట్టాలనుకున్న వారి సంగతి చెప్పాల్సిన పని లేదు. గెలవాలంటే ప్రజలకు బుద్దిగా కనిపించాలన్న భావన వైసీపీ నేతల్లో లేదు. అది అసలు మార్గంగా వారు భావించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవ్ పార్టీ ఇష్యూ- అడ్డంగా బుక్ అయిన సినీ న‌టి హేమ‌

బెంగుళూరు రేవ్ పార్టీ కొత్త మ‌లుపు తీసుకుంది. రేవ్ పార్టీలో డ్ర‌గ్స్ వాడిన‌ట్లు గుర్తించిన పోలీసులు... నార్కోటిక్ ప‌రీక్ష‌లు చేయిస్తున్నారు. ఇందులో ఏపీకి చెందిన వారే ఎక్కువ‌గా ప‌ట్టుబ‌డ్డ‌ట్లు తెలుస్తుండ‌గా, ఓ...

కంటోన్మెంట్ ఉప ఎన్నిక : విజయం ఎవరిని వరిస్తుందో..?

లోక్ సభ ఎన్నికలతోపాటు తెలంగాణలో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక గురించి పెద్దగా చర్చే లేకుండా పోయింది. పార్లమెంట్ ఎన్నికల హడావిడే ఇందుకు ప్రధాన కారణం. మల్కాజ్ గిరి లోక్ సభతోపాటు...

ఈటీవీ నుంచి మ‌రో ఓటీటీ.. ఈసారి వేరే లెవ‌ల్‌!!

సినిమా ప్ర‌పంచంలో ఓటీటీ భాగం అయిపోయింది. సినిమా వ్యాపారంలో ఓటీటీల‌దే కీల‌క భాగ‌స్వామ్యం. అందుకే ఓటీటీల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. మీడియా రంగంలో అగ్ర‌గామిగా నిలిచిన‌ ఈనాడు సైతం ఓటీటీలోకి అడుగు పెట్టింది....

క‌థాక‌మామిషు! (వారం వారం కొత్త క‌థ‌ల ప‌రిచ‌యం)

సాహితీ ప్ర‌క్రియ‌లో క‌థ‌ల‌కు విశిష్ట‌మైన స్థానం ఉంది. మాన‌సిక ఉల్లాసానికీ, స‌రికొత్త‌ ఆలోచ‌నా దృక్ప‌థానికీ క‌థ‌లు త‌మ వంతు సాయం అందిస్తుంటాయి. ఆమ‌ధ్య‌కాలంలో క‌థ‌ల‌కు పెద్ద‌గా ప్రోత్సాహం ల‌భించేది కాదు. అయితే ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close