ఫోన్ ట్యాపింగ్ కేసు …వాళ్ల ఫోన్లు కూడా వదల్లేదు..!!

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వంలో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఇప్పటివరకు విచారణలో తేలగా తాజాగా జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు తేలింది. ఈమేరకు విచారణ అధికారులు జర్నలిస్టులకు సమాచారం అందించారు. ఏకంగా 36 మంది జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఫోన్ ట్యాప్ కు గురైన జర్నలిస్టులకు ఫోన్లు చేసి పోలీసులు అసలు విషయం చెప్పడంతో వారంతా షాక్ అయ్యారు. గతేదాది మార్చి నుంచి అక్టోబర్ వరకు జర్నలిస్టుల కాల్ డేటా గురించి పోలీసులు క్షుణ్ణంగా వివరించడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారని సమాచారం. పోలిసుల సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఆఫీసుకు వెళ్ళిన కొంతమంది జర్నలిస్టులు తమ ఫోన్లు నిజంగానే ట్యాప్ అయ్యాయా..? అని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరెవరితో ఎక్కడ మాట్లాడారు..? ఎంతసేపు మాట్లాడారు..? ఎక్కడెక్కడ ప్రయాణించారు..? అనే విషయాలను పోలీసులు స్పష్టంగా వివరించడంతో జర్నలిస్టులు తమ ఫోన్లు నిజంగానే ట్యాప్ అయ్యాయని నిర్ధారణకు వచ్చారు. అయితే, ఫోన్ ట్యాపింగ్ కు గురైన జర్నలిస్టులలో ఎవరికైనా నాటి ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి వేధింపులు ఎదురయ్యాయా..?అని జర్నలిస్టులను అడిగి తెలుసుకుంటున్నారు.

ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు వినియోగించుకోవాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం కాంగ్రెస్ బీట్ చూసే జర్నలిస్టులను టార్గెట్ చేసి వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు స్పష్టం అవుతోంది. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులే కాకుండా పత్రికల్లో పని చేసే జర్నలిస్టులపై కూడా నిఘా పెట్టారని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కు గురైన జర్నలిస్టులను పిలిచి…ఈ అంశంపై మీద ఫిర్యాదు చేయాలనుకుంటే దర్యాప్తు చేపడుతామని పోలీసులు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close